LOADING...
IPL 2026: ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. రీఎంట్రీ ఎప్పుడంటే?

IPL 2026: ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. రీఎంట్రీ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 10, 2026
09:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ పాత స్థాయికి తిరిగి వస్తుందని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. గత సీజన్‌లోలాగే ఈ సీజన్‌లో కూడా సీఎస్‌కే స్థిరమైన ప్రదర్శన చేయలేకపోతోంది. దీనికి తోడు జట్టుకు కీలకమైన ఎంఎస్ ధోనీ అందుబాటులో లేకపోవడం మరిన్ని సమస్యలకు కారణమైంది. ఐపీఎల్ కోసం పూర్తిగా సిద్ధమైన ధోనీ తొలి మ్యాచ్ నుంచే ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ప్రాక్టీస్ సమయంలో గాయపడటంతో అతను ఇప్పటికీ జట్టులో చేరలేదు. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో కోలుకుంటున్న ధోనీ, ఐపీఎల్ తొలి రెండు వారాల పాటు అందుబాటులో ఉండడని ఫ్రాంచైజీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు అతని ఫిట్‌నెస్‌పై కొత్త సమాచారం బయటకు వచ్చింది.

వివరాలు

తొలి విజయం కోసం చెన్నై ఎదురుచూపు..

మీడియా నివేదికల ప్రకారం, 2026 ఏప్రిల్ 11న ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే హోం మ్యాచ్‌కు కూడా ధోనీ దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో అతను మైదానంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయినప్పటికీ దీనిపై సీఎస్‌కే యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ధోనీ లేకపోవడం సీఎస్‌కేకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, తొలి విజయాన్ని కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ధోనీ త్వరగా జట్టులో చేరితే జట్టుకు పెద్ద బలం అవుతుంది.

వివరాలు

ఇంకా ఫిట్ కాని ధోనీ..

కొద్ది రోజుల క్రితం ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ అతను ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదన్న విషయం యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. ధోనీతో పాటు యువ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ గాయపడటం కూడా సీఎస్‌కేకు మరో పెద్ద దెబ్బ. గాయం కారణంగా అతను తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం అతను కోలుకున్నాడు. తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తాను ఏప్రిల్ 11న మైదానంలోకి తిరిగి వస్తానని బ్రెవిస్ ఇటీవల అభిమానులకు సందేశం పంపాడు.

Advertisement