
GST-Cricket:ఐపీఎల్ టికెట్ రేట్లు జీఎస్టీ 2.0తో ఎంత పెరుగుతాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో కీలకమైన సంస్కరణలను తీసుకువచ్చింది. అందులో భాగంగా, ఇప్పటికే ఉన్న 12%, 28% రేట్ల స్లాబ్లను తీసేసి, వాటిని రెండు స్లాబ్లుగా మార్చింది. లగ్జరీ వర్గానికి చెందిన సేవలు,ఉత్పత్తులను 40% రేటులోకి ప్రతిపాదించింది. ఈ 40% రేటు ఇప్పుడు రేస్ క్లబ్బులు, లీజింగ్ లేదా రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీలు, ఆన్లైన్ మనీ గేమింగ్లకు వర్తిస్తుంది. ఇప్పటి నుండి ప్రీమియం క్రీడా ఈవెంట్లు, ముఖ్యంగా ఐపీఎల్ వంటి టోర్నీ టికెట్ల ధరలు కూడా ఈ జాబితాలోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 28% జీఎస్టీ కింద వచ్చిన ఈ టికెట్లు ఇప్పుడు అదనంగా 40% చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్ అభిమానులపై ఆర్ధిక భారం పెరుగుతుందని భావిస్తున్నారు.
వివరాలు
కొత్త విధానం ప్రకారం,ఐపీఎల్ మ్యాచ్ టికెట్ పై 40%జీఎస్టీ రేటు అమలు
ఉదాహరణకి,ఒక ఐపీఎల్ మ్యాచ్ టికెట్ ధర రూ.1,000 అని అనుకుంటే, ఇప్పటివరకు 28% జీఎస్టీతో టికెట్ ధర మొత్తం రూ.1,280 అవుతుంది. కొత్త విధానం ప్రకారం,40% జీఎస్టీ రేటు అమలు అవ్వడంతో,అదే టికెట్ ధరకు రూ.400 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా మొత్తం రూ.1,400 చెల్లించాలి. అంటే,పాత రేటుతో పోలిస్తే ఒక్కో టికెట్ ధరలో సుమారుగా రూ.120 పెరుగుదల ఉంటుంది. టికెట్ ధరలు మారుతూ ఉండటంతో,ఈ పెరుగుదల కొంత మారవచ్చు.
వివరాలు
సాధారణ స్థాయి క్రీడలకు మాత్రం 18% పన్ను
కొత్త జీఎస్టీ విధానం కేవలం ప్రీమియం లీగులు, పెద్ద క్రీడా టోర్నీలు కోసం మాత్రమే 40% రేటును పెట్టింది. సాధారణ స్థాయి క్రీడలకు మాత్రం 18% పన్ను మాత్రమే కొనసాగుతుంది. ఈ విధంగా, ఐపీఎల్, ఇతర ప్రీమియం లీగులపై ప్రేక్షకుల ఆదరణ పై ప్రభావం ఎలా ఉంటుందో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టికెట్ ధరల పెరుగుదల నేపథ్యంలో, బీసీసీఐ, ఫ్రాంచైజీలు అభిమానుల కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.