Page Loader
Ravindra Jadeja:  చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో అరుదైన ఘనత!
చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో అరుదైన ఘనత!

Ravindra Jadeja:  చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో అరుదైన ఘనత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ మైదానంలో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాది చరిత్రలోకి అడుగుపెట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసిన జడేజా... రెండో ఇన్నింగ్స్‌లో 181 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో అతను లార్డ్స్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలు సాధించిన అరుదైన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఘనతను 93 ఏళ్ల క్రితమే, అంటే 1952లో వినూ మన్కడ్ సాధించాడు.

Details

రాణించిన జడేజా

అప్పట్లో ఆయన 72, 184 పరుగులతో రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ శతకాలు, శతకాలు సాధించాడు. లార్డ్స్‌ మైదానానికి క్రికెట్ చరిత్రలో ప్రత్యేక గౌరవం ఉంది. ఇక్కడ సెంచరీ చేసిన బ్యాటర్, లేదా ఐదు వికెట్లు తీసిన బౌలర్‌ పేరు హానర్‌ బోర్డుపై లిఖిస్తారు. అలాంటి ఘనత సాధించాలనేది ప్రతి క్రికెటర్‌ కల. మూడో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీసి హానర్ బోర్డుపై తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, జడేజా మెరుపు ప్రదర్శన టీమిండియాకు విజయాన్ని తీసుకురాలేకపోయింది.

Details

170 పరుగులకే ఆలౌట్

ఇంగ్లండ్ నిర్దేశించిన 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. చివరకు 170 పరుగులకే ఆలౌటై 22 పరుగుల తేడాతో ఓటమి చెందారు. జడేజా చివరివరకూ పోరాడినా, మిగిలిన బ్యాటర్లు సహకరించకపోవడం భారత్‌ను మట్టికరిపించింది. సిరాజ్, బుమ్రా విలువైన సమయాన్ని గడిపి జడేజాకు సహకరించినా.. క్షణకాలపు అసహనంతో సిరాజ్ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్‌ భారత్‌ నుంచి జారిపోయింది. లార్డ్స్ వేదికగా జడేజా చూపిన అద్భుత ప్రదర్శన మాత్రం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.