Page Loader
 ICC Award: టీమిండియా మిస్ట్రీ స్పిన్నర్‌కు భారీ షాక్.. జోమెల్ వారికన్‌కు 'ఐసీసీ' అవార్డు 
టీమిండియా మిస్ట్రీ స్పిన్నర్‌కు భారీ షాక్.. జోమెల్ వారికన్‌కు 'ఐసీసీ' అవార్డు

 ICC Award: టీమిండియా మిస్ట్రీ స్పిన్నర్‌కు భారీ షాక్.. జోమెల్ వారికన్‌కు 'ఐసీసీ' అవార్డు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ జనవరి 2025కి ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. పాకిస్తాన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అతను ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ఈ విజయం అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను సూచించడంతో పాటు, వెస్టిండీస్ 35 ఏళ్ల తర్వాత ఆసియా దేశంలో తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జనవరిలో జరిగిన పోటీల్లో పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ, భారతీయ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు వారికన్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడ్డాడు. అయితే చివరకు ఈ వెస్టిండీస్ స్టార్ విజేతగా నిలిచాడు.

Details

రికార్డుల మోత

32 ఏళ్ల వారికన్ తన అసాధారణ ప్రదర్శనలో రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో 9.00 సగటుతో 19 వికెట్లు సాధించాడు. ఈ ఘనతను సాధించిన రెండవ వెస్టిండీస్ స్పిన్నర్‌గా నిలిచాడు. మే 2024లో గుడకేష్ మోతీ తర్వాత ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి వెస్టిండీస్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో 10/101 బౌలింగ్ గణాంకాలతో తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన అందించాడు. కానీ సాజిద్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు 127 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Details

మూడోవ వెస్టిండీస్ ప్లేయర్ గా రికార్డు

అదే వేదికపై జరిగిన రెండో టెస్టులో వారికన్ తిరిగి తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. బ్యాటింగ్‌లో 36 పరుగులు చేసి జట్టుకు మెరుగైన ఆధిక్యం అందించాడు. అలాగే బౌలింగ్‌లో 4/43, 5/27 గణాంకాలతో మొత్తం 9 వికెట్లు తీసి, వెస్టిండీస్‌కు 120 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి 11న జోమెల్ వారికన్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ గౌరవాన్ని గెలుచుకున్నాడు. గుడకేష్ మోతీ, షమర్ జోసెఫ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ వెస్టిండీస్ క్రికెటర్‌గా నిలిచాడు.