LOADING...
Team India: తొలి వన్డేలో భాషా చర్చ.. మైదానంలో తమిళం, కామెంటరీలో 'జాతీయ భాష' వివాదం!
తొలి వన్డేలో భాషా చర్చ.. మైదానంలో తమిళం, కామెంటరీలో 'జాతీయ భాష' వివాదం!

Team India: తొలి వన్డేలో భాషా చర్చ.. మైదానంలో తమిళం, కామెంటరీలో 'జాతీయ భాష' వివాదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

వడోదర వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అతని మాతృభాష అయిన తమిళంలో సూచనలివ్వడం, ఆ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో జరిగిన చర్చ వివాదానికి దారి తీసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో వేగంగా బంతులు వేస్తున్న వాషింగ్టన్ సుందర్‌ను నెమ్మదిగా బౌలింగ్ చేయాలని రాహుల్ స్టంప్ మైక్‌లో తమిళంలో సూచించాడు. ఈ ఘటనపై స్పందించిన కామెంటేటర్ వరుణ్ ఆరోన్, సుందర్‌కు విషయం స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే రాహుల్ తమిళంలో మాట్లాడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

Details

నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం

అయితే ఈ చర్చలోకి మరో కామెంటేటర్, మాజీ టీమ్‌ఇండియా కోచ్ సంజయ్ బంగర్ జోక్యం చేసుకుని తాను 'జాతీయ భాష (రాష్ట్రీయ భాష)'కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. భారత రాజ్యాంగం ప్రకారం దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదని, హిందీ, ఇంగ్లిష్‌లు అధికార భాషలుగా మాత్రమే ఉన్నాయని నెటిజన్లు గుర్తుచేశారు. మ్యాచ్ విషయానికొస్తే, ఈ తొలి వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.

Details

సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ 

301 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 93 పరుగులతో అద్భుతంగా రాణించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 56 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. సైడ్ స్ట్రెయిన్ కారణంగా అతడు తప్పుకోవడంతో, అతని స్థానంలో ఆయుష్ బదోనిని భారత జట్టులోకి ఎంపిక చేశారు.

Advertisement