Mirabai chanu: కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని మోయనున్న మీరాబాయి చాను
ఈ వార్తాకథనం ఏంటి
2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో భారత జాతీయ పతాకాన్ని ప్రముఖ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను మోసే గౌరవం దక్కించుకుంది. గురువారం స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగే ప్రారంభ వేడుకల్లో ఆమె భారత జెండాతో ముందుండి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
వివరాలు
2023 ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం..
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రముఖ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ బ్యాటన్ను చేతబట్టి భారత బృందంతో కలిసి అడుగులు వేయనుంది.
ఈసారి కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. 49 కేజీల విభాగంలో పోటీపడే మీరాబాయి చాను 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించగా, 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
మరోవైపు, లవ్లీనా బోర్గొహైన్ 2023 ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలవడంతో పాటు, టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది.