NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / MS Dhoni: ఎంఎస్‌ ధోనీ మరో రికార్డు.. ఐపీఎల్‌లో 11 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MS Dhoni: ఎంఎస్‌ ధోనీ మరో రికార్డు.. ఐపీఎల్‌లో 11 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు
    ఎంఎస్‌ ధోనీ మరో రికార్డు.. ఐపీఎల్‌లో 11 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు

    MS Dhoni: ఎంఎస్‌ ధోనీ మరో రికార్డు.. ఐపీఎల్‌లో 11 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అభిమానులు ముద్దుగా "తలా"గా పిలుచుకునే మహేంద్ర సింగ్‌ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది.

    ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది.

    మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేయగా, అనంతరం లక్ష్యచేదనకు దిగిన చెన్నై జట్టు 19.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 168 పరుగులతో గెలుపొందింది.

    ఈ విజయంలో చెన్నై జట్టుకు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన ఘనత దక్కింది.

    vivaralu

    ధోనీ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'

    ఈ గెలుపులో ధోనీ కీలకపాత్ర పోషించాడు.కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

    ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ తో ధోనీ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డును గెలుచుకున్నాడు.ఈ విజయం ద్వారా ఐపీఎల్‌ చరిత్రలో 11సంవత్సరాల రికార్డును తిరగరాశాడు.

    అయితే,ఈ విజయంతో ధోనీ అరుదైన ఘనతను సాధించాడు.అతడు 43 ఏళ్లు 280 రోజుల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకుని, ఐపీఎల్‌ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత వయోవృద్ధ ఆటగాడిగా నిలిచాడు.

    ఇదివరకూ ఈ ఘనత ప్రవీణ్‌ తాంబే పేరిట ఉండేది.తాంబే 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆడిన మ్యాచ్‌లో 42 ఏళ్లు 208 రోజుల వయసులో 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డును గెలిచాడు.

    వివరాలు 

    'ఇది ఆరంభం మాత్రమే'... 

    మ్యాచ్‌ అనంతరం ప్రెజెంటేషన్‌ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ,"మా బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాలు రెండు కూడా చక్కగా ఆడాయి. మాకు మంచి ఆరంభం దక్కడం వల్ల ఛేదన సులభమైంది. ఓపెనర్‌ షేక్‌ రషీద్‌ అద్భుతంగా ఆడాడు. అతను భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు మా జట్టులో భాగంగా ఉంటాడని నమ్ముతున్నా. నెట్స్‌లో పేసర్‌లను, స్పిన్నర్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇది అతని ప్రయాణానికి కేవలం ఆరంభం మాత్రమే. రషీద్‌లో విపరీతమైన ప్రతిభ ఉంది. అతను ఆత్మవిశ్వాసంతో, దూకుడుగా ఆడగలడు. అలాగే నిజంగా ఈ రోజు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డుకు అర్హుడు నూర్‌ అహ్మద్‌ కావాలి. అతడు ఎంతో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. నాకు కన్నా ఎక్కువ ఈ గౌరవానికి అతడే పాత్రధారి" అని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని

    తాజా

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌

    ఎంఎస్ ధోని

    MS Dhoni: సాధారణ భక్తుడి లాగే... ఎంఎస్ ధోనీ!  క్రీడలు
    MS Dhoni Captain: IPL ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా MS ధోని ఎంపిక  క్రీడలు
    Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో  అనంత్ అంబానీ
    IPL 2024: కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోని  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025