Page Loader
Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్
పారాలింపిక్స్‌లో భారత్‌ మరో స్వర్ణం

Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2024
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం అందింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో నితేశ్‌ కుమార్ పసిడి సాధించాడు. పారాలింపిక్స్‌లో తొలి సారి ఆడుతున్న నితేశ్, ఫైనల్‌లో 21-14, 18-21, 23-21 స్కోరుతో బ్రిటన్‌ ఆటగాడు డానియల్‌ బెట్ల్‌ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన బెట్ల్, ఈసారి కూడా ఫైనల్‌లో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చాడు.

వివరాలు 

పసిడి కోసం ఫ్రాన్స్‌ ఆటగాడు లుకాస్‌తో పోటీ 

తొలి గేమ్‌లో నితేశ్‌ ఆధిపత్యం చూపగా, రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. 11-8తో ఆధిక్యంలో ఉన్న నితేశ్‌ అనంతరం కాస్త పట్టు తప్పించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించిన బ్రిటన్‌ ఆటగాడు వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి మూడో గేమ్‌ కూడా నువ్వానేనా అన్నట్లుగా సాగింది, కానీ చివరకు నితేశ్‌ విజయం సాధించాడు. మరొకవైపు, ఎస్‌ఎల్‌4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌ వరుసగా రెండవ సారి ఫైనల్‌కు చేరాడు. టోక్యోలో రజతం గెలిచిన సుహాస్‌ ఈసారి పసిడి కోసం ఫ్రాన్స్‌ ఆటగాడు లుకాస్‌తో తలపడబోతున్నాడు. ఫైనల్‌ ఈ రాత్రి 9.40 గంటలకు ప్రారంభంకానుంది.