
Neeraj Chopra: ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా
ఈ వార్తాకథనం ఏంటి
ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అందజేశారు. జావెలిన్ త్రోలో ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన నీరజ్ చోప్రా 2016లో సుబేదార్గా ఆర్మీ చేరారు. తర్వాత 2021లో మేజర్గా పదోన్నతి పొందారు. కేంద్రం ఆయనకు 2022లో 'పరమ విశిష్ట సేవా పతకం'తో సత్కరించింది. ఇప్పుడు మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్గా హోదా అందుకొన్నారు. భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నను 2021లో గెలుచుకున్న నీరజ్ చోప్రా, 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా
#WATCH | Delhi | Olympic medallist javelin thrower Neeraj Chopra conferred the honorary rank of Lieutenant Colonel in the Indian Army, in the presence of Defence Minister Rajnath Singh and COAS General Upendra Dwivedi pic.twitter.com/bjLwuvoSLj
— ANI (@ANI) October 22, 2025