 
                                                                                AFG vs PAK: అఫ్గానిస్థాన్పై పాక్ వైమానిక దాడి.. ముగ్గురు క్రికెటర్లు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
పొరుగు దేశాలతో ప్రశాంతంగా ఉండాలని పాకిస్థాన్కు అసలు ఆసక్తి లేదేమో అన్న భావన కలుగుతోంది. ఇటీవలి వరకు భారత్పై దూకుడుగా వ్యవహరించి గట్టి ప్రతిఘటనను ఎదుర్కొన్న పాక్... ఇప్పుడు మరో సరిహద్దు దేశమైన అఫ్గానిస్థాన్పై దాడికి పాల్పడింది. ఈస్ట్రన్ పాక్టికా ప్రావిన్స్పై పాకిస్థాన్ వైమానిక దళం దాడి జరిపింది. ఈ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు ఉన్నారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు పాల్గొనే ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఏసీబీ ప్రకటించింది. 'పాక్టికా ప్రావిన్స్లోని ఉర్గున్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లు పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
Details
ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన
పాక్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో నిరపరాధ అఫ్గాన్ పౌరులు మృతి చెందడం తీవ్ర విచారకరం. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, అందులో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. పాక్టికా రాజధాని శరణకు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూన్ తిరిగి ఉర్గున్ వస్తుండగా ఈ దాడి జరిగింది. అఫ్గాన్ అథ్లెటిక్స్, క్రికెట్ కుటుంబానికి ఇది భర్తీ చేయలేని నష్టం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ఘటన దృష్ట్యా వచ్చే నెల జరగబోయే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం. ఆ సిరీస్లో పాకిస్థాన్ పాల్గొనడం వల్లనే మేము తప్పుకుంటున్నాం. గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఏసీబీ తెలిపింది.