NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 
    తదుపరి వార్తా కథనం
    IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 
    అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌

    IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'ఆపరేషన్ సిందూర్' వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు.

    ఈ పరిణామం ఐపీఎల్‌పై కూడా ప్రభావం చూపింది. ముంబయి ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మే 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను వేరే ప్రదేశానికి మార్చారు.

    ఈ మ్యాచ్‌ను ధర్మశాల బదులు అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు.

    "బీసీసీఐ ముంబయి-పంజాబ్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని కోరింది. మేమూ అందుకు ఒప్పుకున్నాం. ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు ఈ రోజు అహ్మదాబాద్‌ చేరుకుంటారు. కానీ పంజాబ్ జట్టు ప్రయాణ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది," అని అనిల్ పటేల్ తెలిపారు.

    వివరాలు 

    షెడ్యూల్ ప్రకారమే పంజాబ్ కింగ్స్‌,ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌

    ధర్మశాల విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయటంతో ముంబయి జట్టు అక్కడకు వెళ్లకపోవడానికి కారణమని సమాచారం.

    ఇదిలా ఉండగా, ధర్మశాలలో ఇవాళ పంజాబ్ కింగ్స్‌,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉంది.

    ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోవడంతో ప్రయాణ సమస్యలు ఎదురుకాలేదు.

    అయితే, సాయంత్రం మ్యాచ్ సందర్భంగా ఫ్లడ్‌లైట్లను ఉపయోగించడం భద్రతాపరంగా సమస్యగా మారినట్టు తెలుస్తోంది.

    దీంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న విషయంపై అనిశ్చితి నెలకొనగా... ఇప్పుడు మాత్రం స్పష్టత ఏర్పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌  ఐపీఎల్
    Operation Sindoor: జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ సోదరుడు.. IC-814 హైజాక్‌ మాస్టర్‌మైండ్‌ రవూప్‌ అజహర్‌ హతం..!  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' టైటిల్‌ కోసం బాలీవుడ్‌లో పోటీ.. 15 మంది నిర్మాతలు దరఖాస్తు  ఆపరేషన్‌ సిందూర్‌
    India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం.. పాకిస్థాన్

    ఐపీఎల్

    SRH vs MI : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపు  క్రీడలు
    Arshdeep Singh: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌  క్రీడలు
    RCB-PBKS:  సొంత గడ్డపై చతికిల పడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 5 వికెట్ల తేడాతో  పంజాబ్ కింగ్స్ గెలుపు  క్రీడలు
    RR Vs LSG: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ పోరు..  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025