IPL 2026: ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ను విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు జరిమానా వేశారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో జట్టు నిర్దేశిత ఓవర్ రేట్ను నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు అతనికి రూ.12 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం (ఆర్టికల్ 2.22), కనీస ఓవర్ రేట్ను పాటించకపోవడం ఒక ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఇది మొదటి తప్పిదం కావడంతో, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై రూ.12 లక్షల ఫైన్ విధించామని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో తెలిపింది.
వివరాలు
కూపర్ కనోలీ అద్భుత ప్రదర్శన
మరోవైపు, నిన్న రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును 162 పరుగులకు పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. పేసర్ వైశాఖ్ విజయకుమార్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కలిసి ఐదు వికెట్లు తీసి జట్టుకు బలాన్ని అందించారు. తరువాత లక్ష్యాన్ని చేధించడానికి దిగిన పంజాబ్ జట్టు 19.1 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కనోలీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతను 44 బంతుల్లో 72 పరుగులు చేసి అవుట్ కాకుండా నిలిచి జట్టును గెలిపించాడు.