పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: వార్తలు
Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని విపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన విపక్షాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది
జూలై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 6 కొత్త బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో విపత్తు నిర్వహణతో పాటు మరో 5 బిల్లులు ఉన్నాయి.
Budget 2024: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం.. బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీ దాదాపు ఖరారైంది. మోదీ ప్రభుత్వం 3.0 వర్షాకాల సమావేశాలు జూలై 22 నుండి ఆగస్టు 9 వరకు జరుగుతాయని వర్గాలు చెబుతున్నాయి.
PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజున లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం
సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం
దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.
'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు'
భారతదేశంలో నేర సంబంధిత అంశాలపై న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 నేటితో ముగియనున్నాయి. జులై 20న ప్రారంభమైన సమావేశాలు తొలి రోజుల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
లోక్సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్
మూడో రోజూ అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభ వేదికగా అధికార పక్షం, విపక్షాలే లక్ష్యంగా మాటల తుటాలు వదిలారు.
కాంగ్రెస్ వ్యాఖ్యలపై దుమారం.. ప్రధానిని సభకు రప్పించింది మేం కాదు, అవిశ్వాస తీర్మాన శక్తి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి. కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత 3 రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది.
ఫ్లయింగ్ కిస్ వివాదం.. రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
పార్లమెంట్లో బుధవారం జరిగిన ఫ్లయింగ్ కిస్ వివాదంపై మహిళా ఎంపీ రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచారు. శివసేన (UBT)కి చెందిన ప్రియాంక చతుర్వేది సంఘీభావం ప్రకటించారు.
లోక్సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారాస ఎంపీ నామా నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.
రాజ్యసభలో గందరగోళం.. టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్పై సస్పెన్షన్ వేటు
రాజ్యసభలో నేడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు.
పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్కమ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ; నేడు పార్లమెంట్కు కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సైలెంట్గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హట్ టాపిక్గా మారాయి. గురువారం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలను చేసింది.
దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు
పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దిల్లీ గురించి ఆలోచించాలని విపక్ష కూటమికి చెందిన ఎంపీలకు సూచనలు చేశారు.
రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి
మణిపూర్ అల్లర్లపై విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏ రూల్ ప్రకారమైనా చర్చలు చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమని ప్రకటించింది.
Delhi services bill: లోక్సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా
మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో దిల్లీ సర్వీస్ బిల్లు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను ప్రవేశపెట్టారు.
ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.
Delhi Services Bill: నేడు లోక్సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
దిల్లీ సర్వీసెస్ బిల్లు (గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఈ బిల్లును లోక్సభలో ప్రతిపాదించనున్నారు.
లోక్సభలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గనులు, ఖనిజాల సవరణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను లోక్సభ ఆమోదించింది. ద నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమీషన్ బిల్లు 2023, ద నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు సభలో పాసైంది.
భారత వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే భేష్ : కిరణ్ రిజిజు
భారతదేశంలోని వాతావరణ అంచనా వ్యవస్థలు భేషుగ్గా ఉన్నట్లు కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల కంటే భారత్ లోని వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
అటవీ సంరక్షణ సవరణ బిల్లు 2023కి లోక్సభ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించి కీలక అడుగు పడింది. అటవీ పరిరక్షణ సవరణ బిల్లు (Forest Conservation Amendment Bill)కు లోక్సభ ఆమోదం లభించింది.
INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు
మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిరసనలతో చట్టసభల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
రాజస్థాన్లో మహిళలపై దాడులు, మణిపూర్లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితిపై చర్చ నేపథ్యంలో పార్లమెంట్ అట్టుడికిపోతోంది.
రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
వరుస హింసాత్మక ఘటనలతో అల్లాడిపోతున్న మణిపూర్లో మరో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో వైరల్గా మారడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ మణిపూర్ దారుణ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి.
మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపూర్ కాలిపోతోందన్న నినాదాలతో సభలు దద్దరిలిపోయాయి. ఈశాన్య రాష్ట్రంలో జరిగిన అమానుష ఘటన పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించింది.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త కూటములు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్షాలు (ఇండియా) బలాన్ని పెంచుకుంటున్నాయి.
రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మణిపూర్లో చెలరేగిన హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం(జూలై 20) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.