
'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.
దేశ రాజధానిలో సేవల నియంత్రణపై వివాదాస్పద ఆర్డినెన్స్ను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ని ఆగస్టు 1న లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత ఈ బిల్లును ఆగస్టు 7న రాజ్యసభలో ఆమోదించారు. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆప్కు ఎదురుదెబ్బ
Big Breaking News - President Droupadi Murmu approves Delhi Ordinance Bill🔥.
— Times Algebra (@TimesAlgebraIND) August 12, 2023
Setback for AAP. The law will give the centre the power through LG to appoint the heads and members of various boards and commissions working under Delhi government. It will also gain control over…