NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక 
    తదుపరి వార్తా కథనం
    సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక 
    సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక

    సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 04, 2023
    01:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారాయి. గురువారం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలను చేసింది.

    విపక్ష నేతలు సైలెంట్ గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడి వస్తుందంటూ కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పార్లమెంట్ సాక్షిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేతలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్రంగా స్పందించిన మంత్రి మీ ఇంటికి ఈడీ అధికారులు వస్తారంటూ హెచ్చరికలు జారీ చేసింది.

    మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

    Details

    దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది

    దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

    ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు, కీలక నేతలపై ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతున్నాయని, తమ నేతలను బెదిరించి బీజేపీలోకి చేర్చుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు.

    ఈ ఆరోపణలకు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాటలే నిదర్శమని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మండిపడ్డారు.

    ఇక మంత్రి మీనాక్షి ప్రతిపక్ష నేతలకు వార్నింగ్ ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోలింగ్ నడుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    కేంద్రమంత్రి

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  రాజ్యసభ
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే మణిపూర్
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  కేంద్ర ప్రభుత్వం

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025