NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం 
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం 

    వ్రాసిన వారు Stalin
    Jul 19, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం(జూలై 20) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

    ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కోరే అవకాశం ఉంది.

    అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు.

    వాస్తవానికి రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్కర్ మంగళవారం ఎగువసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    బెంగుళూరులో ప్రతిపక్షాలు సమావేశం, దిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నేపథ్యంలో అయితే చాలా మంది హాజరు కాలేదు. దీంతో సమావేశం వాయిదా పడింది.

    దిల్లీ

    ఎన్నికల వేళ రసవత్తరంగా మారనున్న వర్షాకాల సమావేశాలు 

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన కేబినెట్ సహచరులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌లతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరు అఖిలపక్ష సమావేశంలో చర్చించే పాయింట్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం గోయల్ రాజ్యసభలో సభా నాయకుడిగా ఉండగా, జోషి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.

    ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంట్ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

    ముఖ్యంగా దిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం రెండు సభల్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు ప్రహ్లాద్ జోషి
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    నరేంద్ర మోదీ

    ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అత్యవసర సమావేశం ముస్లింలు
    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన బీజేపీ
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ఈజిప్ట్
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం కేంద్ర ప్రభుత్వం

    తాజా వార్తలు

    US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి బ్యాట్మింటన్
    జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి లక్ష్యసేన్
    'సలార్' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన జగపతి బాబు  సలార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025