NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు
    తదుపరి వార్తా కథనం
    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు
    మోదీ ప్రభుత్వపై నేడు అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు

    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు

    వ్రాసిన వారు Stalin
    Jul 26, 2023
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

    ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాల కూటమి సిద్ధమవుతోంది.

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని, సుదీర్ఘ చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

    ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

    మోదీ

    ప్రతిపక్షల ఎంపీల సమావేశం; విప్ జారీ చేసిన కాంగ్రెస్

    లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌రంజన్‌ చౌదరి వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు.

    నోటీసు కోసం ఎంపీల సంతకాల సేకరణ కోసం ఇండియా కూటమి ఎంపీలు బుధవారం ఉదయం సమావేశం కాబోతున్నాయి.

    ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన లోక్ సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్‌సభ ఎంపీలందరూ పార్లమెంట్‌కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరగనుంది.

    దీంతో పాటు ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడంపై రాజ్యసభలో విపక్ష ఎంపీల నిరసన పార్లమెంట్‌ ఆవరణలో కొనసాగుతోంది.

    మోదీ

    మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరికి అమిత్ షా లేఖ

    పార్లమెంట్‌లో మణిపూర్ అంశంపై చర్చకు సహకరించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరిలకు లేఖ రాశారు.

    మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరూ సహకరించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న అధిర్ రంజన్ చౌదరికి రాసిన లేఖల్లో అమిత్ షా పేర్కొన్నారు.

    అంతకుముందు, ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీల కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల ఇండియా కూటమిని 'ఈస్ట్ ఇండియా కంపెనీ', 'ఇండియన్ ముజాహిదీన్' వంటి పేర్లతో పోల్చారు.

    దేశం పేరును ఉపయోగించి ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించలేరని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రతిపక్షాలు
    ఇండియా
    ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    ప్రతిపక్షాలు

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ బెంగళూరు
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు దిల్లీ
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు మల్లికార్జున ఖర్గే

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్

    ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్

    I.N.D.I.A: దేశం పేరును సొంత ప్రయోజనం కోసం వాడుతున్నారని కేసు నమోదు భారతదేశం
    మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన  మణిపూర్
    మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే దిల్లీ
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025