NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 
    కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని విపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

    ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించింది.

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం వెల్లడించిన ప్రకారం,జూలై 21 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

    ఈ 23 రోజుల సమావేశాల్లో పహల్గాం దాడి తర్వాత సాగించిన ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు అవకాశం ఉండనున్నట్లు సమాచారం.

    అంతేకాకుండా,ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. జాతీయ భద్రత,ఆర్థిక పరిపాలన అంశాలపై కూడా చర్చలు సాగే అవకాశముంది.

    వివరాలు 

    ప్రధానిని కోరిన ఎంపీలు 

    పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత ఆర్మీ 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్ వైమానిక స్థావరాలపై లక్ష్యంగా దాడులు నిర్వహించింది.

    అయితే, ఈ ఆపరేషన్ విజయానికి దగ్గరగా ఉన్న సమయంలోనే మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడంపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు,ప్రశ్నలు ఊపందుకున్నాయి.

    ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రభుత్వం నుంచి ఎవరు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విపక్షాల ఆగ్రహానికి దారితీసింది.

    ఈ నేపథ్యంలో పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలంటూ 16 విపక్ష పార్టీలు కలిసి మంగళవారం ప్రధానికి లేఖ రాశాయి.

    ఈ లేఖపై లోక్‌సభకు చెందిన 200 మందికిపైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు.

    వివరాలు 

    చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు 

    పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్‌పై చర్చ తప్పనిసరి అని విపక్ష పార్టీలు స్పష్టంగా పేర్కొంటున్నాయి.

    అంతేకాకుండా, భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిగా వ్యవహరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ అవసరమని సూచించాయి.

    సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ రేంజర్లు జరిపిన షెల్లింగ్‌లో ప్రాణాలు కోల్పోయిన సాధారణ పౌరుల విషయాన్ని కూడా సభలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశాయి.

    ఆపరేషన్ సిందూర్ విషయంలో అన్ని విపక్ష పార్టీలు కేంద్రానికి సంపూర్ణ మద్దతు తెలిపినప్పటికీ, ఈ దృష్ట్యా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని విపక్షాలు అర్ధించుకుంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    తాజా

    Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో  పాకిస్థాన్
    Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు  జపాన్
    Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్! సమంత

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే దిల్లీ
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025