LOADING...
Operation Sindoor: నేటి నుంచి పార్లమెంటులో 'సిందూర్‌'పై చర్చ
నేటి నుంచి పార్లమెంటులో 'సిందూర్‌'పై చర్చ

Operation Sindoor: నేటి నుంచి పార్లమెంటులో 'సిందూర్‌'పై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వ్యవహారం ఇప్పుడు పార్లమెంటు ఉభయసభల దృష్టిని ఆకర్షిస్తోంది. సోమవారం నుంచి ఈ అంశంపై తీవ్ర చర్చకు వేదికగా లోక్‌సభ మారనుంది. ఈ దాడిలో పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సైన్యం కీలకంగా సాగించిన ఈ ఆపరేషన్‌ను అకస్మాత్తుగా నిలిపివేయడంపై విపక్షాలు కేంద్రంపై గట్టిగా ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో అధికార పక్షం తమ వైపు నుంచి సమగ్ర సమాధానాలు ఇచ్చేందుకు తగిన రణతంత్రంతో ముందుకు వస్తోంది.

వివరాలు 

ఉభయ సభల్లో ఒక్కో దానిలో 16గంటల చొప్పున సమయం

పాక్‌లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం నిర్వహించిన దాడులు నిర్ణయాత్మకంగా సాగుతున్న సమయంలో ఆపరేషన్‌ను ఆపివేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా వాడుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు సభలో ప్రస్తావించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ట్రంప్ తన హయాంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే నివారించానంటూ 26సార్లు చెప్పిన విషయాన్ని విపక్షం ప్రధానంగా ఎత్తిచూపనుంది. ఈ చర్చ కోసం ఉభయ సభల్లో ఒక్కో దానిలో 16గంటల చొప్పున సమయం కేటాయించారు. ముందుగా లోక్‌సభలో చర్చ ప్రారంభమవుతుంది. రాజ్యసభలో మంగళవారం నుంచి చర్చ జరగనుంది.ఈ మూడు రోజులు..సోమవారం,మంగళవారం, బుధవారం.. కాంగ్రెస్ పార్టీ తన సభ్యులంతా లోక్‌సభకు తప్పకుండా హాజరుకావాలంటూ విప్‌ జారీ చేసింది.

వివరాలు 

అమెరికా జోక్యంపై ప్రభుత్వానికి విపక్షాల నిలదీత 

భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాక్‌ను రాజకీయ,వ్యూహాత్మకంగా ఒత్తిడి చెందేట్లుగా చేసి, ప్రపంచానికి పాక్ మద్దతుదారుల నిజ స్వరూపాన్ని చూపించగలిగిందని అధికార కూటమి భావిస్తోంది. ఈ విజయాన్ని సభలో వివరించే సిద్ధంగా ఉంది. కానీ అమెరికా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందా లేదా?దాని పాత్ర ఏంటన్న దానిపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీయాలని చూస్తున్నాయి. అమెరికా జోక్యం నిజమైతే అది భారత సార్వభౌమత్వంపై తూటా కాకపోతుందా? అన్న ప్రశ్నలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. అంతేకాదు,ఆపరేషన్ సమయంలో మన యుద్ధవిమానాలు కూలినట్లు వార్తలు వచ్చాయి. వాటిలో ఎంత నిజం ఉంది? ఈ దాడులకు పాల్పడిన అసలైన ముష్కరులను ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం విపక్షాలు ప్రభుత్వాన్ని కఠినంగా గిరాకీ చేయనున్నాయి.