NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లోక్‌స‌భలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గ‌నులు, ఖ‌నిజాల స‌వ‌ర‌ణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 
    తదుపరి వార్తా కథనం
    లోక్‌స‌భలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గ‌నులు, ఖ‌నిజాల స‌వ‌ర‌ణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 
    గ‌నులు, ఖ‌నిజాల స‌వ‌ర‌ణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్

    లోక్‌స‌భలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గ‌నులు, ఖ‌నిజాల స‌వ‌ర‌ణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 28, 2023
    02:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను లోక్‌స‌భ ఆమోదించింది. ద నేష‌న‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ క‌మీష‌న్ బిల్లు 2023, ద నేష‌న‌ల్ డెంట‌ల్ క‌మిష‌న్ బిల్లు స‌భ‌లో పాసైంది.

    మరోవైపు గ‌నులు, ఖ‌నిజాల అభివృద్ధి, నియంత్ర‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023ని లోక్‌స‌భ‌లో ఆమోదించారు. మూజువాణి ఓటు ద్వారా బిల్లు పాసైనట్లు ప్రకటించారు.

    (Mines and Minerals Amendment Bill) 2023కి దిగువసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కారణంగా సదరు బిల్లు గేమ్ ఛేంజ‌ర్ కానున్న‌ట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో త్వ‌ర‌లోనే వన్ బిలియ‌న్ ట‌న్నుల బొగ్గును దేశీయంగా ఉత్ప‌త్తి చేయనున్నట్లు జోషి సభ ద్వారా స్పష్టం చేశారు.

    DETAILS

    విప‌క్ష ఎంపీల నిర‌స‌నతో సోమ‌వారానికి సభ వాయిదా

    భారతదేశంలో బొగ్గును వెలికితీసే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేట్ సంస్థలకు బొగ్గు గ‌నుల కేటాయింపులో భాగంగా త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌ విధానం పాటిస్తోందని కేంద్రమంత్రి జోషి చెప్పుకొచ్చారు.

    మైనింగ్ బిల్లు ద్వారా గ‌నుల లీజు విష‌యంలో కేంద్రానికి మ‌రిన్ని అధికారాలు సమకూరుతాయని జోషి అన్నారు. గ‌నులు, ఖ‌నిజాల బిల్లుతో తమ ప్రభుత్వం చేపట్టిన స‌వ‌ర‌ణ‌లతో బొగ్గును స్వదేశంలో ఉత్ప‌త్తి చేసి భారత్ ను సుస్థిరం చేస్తామన్నారు.

    2025-06 నాటికి విదేశాల నుంచి అన్ని రకాల బొగ్గు దిగుమ‌తులను నిలిపేయనున్నట్లు మంత్రి జోషి వివరించారు.

    ఒక దశలో మంత్రి ప్ర‌హ్లాద్ జోషి కోల్ పాలసీని వివరిస్తుండగా, విప‌క్షాలు మ‌ణిపూర్ అంశంపై పెద్ద ఎత్తున నినదించాయి. విప‌క్ష ఎంపీల నిర‌స‌నతో స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    లోక్‌సభ

    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్ బీజేపీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే దిల్లీ
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025