NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు
    తదుపరి వార్తా కథనం
    అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు
    జూ, స‌ఫారీల‌ ఏర్పాటుకు ముందడుగు

    అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 26, 2023
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించి కీలక అడుగు పడింది. అట‌వీ ప‌రిర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు (Forest Conservation Amendment Bill)కు లోక్‌స‌భ ఆమోదం లభించింది.

    ఈ మేరకు కేంద్ర అటవీశాఖ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్ లోక్‌స‌భ‌లో బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. తర్వాత ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలను సదరు అటవీశాఖ మంత్రి సభకు వివరించారు.

    ఈ క్రమంలోనే బిల్లుపై సభలో స్వల్ప కాలం చ‌ర్చలు జరిగాయి. ఈ మేరకు అట‌వీ ప‌రిర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి దిగువసభ ఆమోదించింది.

    దేశ స‌రిహ‌ద్దుల్లో సుమారు 100 కిలోమీట‌ర్ల రేంజ్‌ ఏరియాలోని అటవుల్లో జూ కేంద్రాలు, స‌ఫారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన చ‌ట్టానికి తాజాగా సవరణలు చేశారు.

    DETAILS

    100 కిలోమీట‌ర్ల రేంజ్‌లో  జాతీయ ప్రాముఖ్య‌త ప్రాజెక్టులకు లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్

    ప్రస్తుతం భారతదేశం స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో దాదాపు వంద కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదు.

    ఈ నిబంధనలను మార్చి అక్కడి అడ‌వుల్లో జూలు, స‌ఫారీలు, ఎకో టూరిజం సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసేందుకు పాత చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం ప్రభుత్వం బిల్లు రూపొందించింది.

    అందులో భాగంగానే ఇవాళ పాత అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టాలను సవరిస్తూ, సరిహద్దు ఫారెస్ట్ ఏరియాలో కార్యకలాపాలు చేపట్టేందుకు దిగువసభలో కీలక ఆమోదం దక్కింది.

    అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (INTERNATIONAL BOUNDARY), నియంత్ర‌ణ రేఖ‌ (LOC), వాస్త‌వాధీన రేఖకు 100 కిలోమీట‌ర్ల రేంజ్‌లో ఉన్న అటవుల్లో జాతీయ ప్రాముఖ్య‌త ప్రాజెక్టులు నిర్మించేందుకు చ‌ట్టానికి సవరణలు చేపట్టారు.

    బిల్లు ఆమోదం పొందాక లోక్‌స‌భను గురువారానికి వాయిదా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    అటవీశాఖ
    లోక్‌సభ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే దిల్లీ
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  బీజేపీ

    అటవీశాఖ

    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ చంద్రబాబు నాయుడు

    లోక్‌సభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా రాజ్యసభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025