NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు
    మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు

    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 20, 2023
    10:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త కూటములు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్షాలు (ఇండియా) బలాన్ని పెంచుకుంటున్నాయి.

    ప్రజా సమస్యలపై స్పందించే క్రమంలో కూటములు ఒకరినొకరు ఇరుకునపెట్టుకోనున్నాయి. 2 పక్షాలు వ్యూహాలు, అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి.

    ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చెలరేగుతున్న మణిపూర్‌ మారణకాండపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా స్పందించలేదు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.

    కామన్ సివిల్ కోడ్ (UCC), దిల్లీ ఆర్డినెన్సు (అత్యవసర ఆదేశం), రైల్వే భద్రత ( ఒడిషా ఘటన), దర్యాప్తు సంస్థల దుర్వినియోగం (IT, CBI,ED),సరిహద్దు స్థితిగతులు చర్చకు రానున్నాయి.

    DETAILS

    సబ్జెక్టులపై వ్యూహరచనకు రోజూ సమావేశమవ్వాలని విపక్షాల నిర్ణయం

    ధరల పెరుగుదల, మహిళా రిజర్వేషన్లు, ద్రవ్యోల్బణంపైనా చర్చలు జరగనున్నాయి. ఆయా సబ్జెక్టులపై వ్యూహరచనకు రోజూ సమావేశమవ్వాలని విపక్ష కూటమి నిర్ణయం తీసుకుంది.

    నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. మొత్తం 17 పని దినాల్లో 32 అంశాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.

    మొదటి రోజు తొలి సెషన్ ప్రారంభం నుంచే ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు విపక్షాలు సర్వసన్నద్ధమయ్యాయి.

    మరోవైపు దిల్లీ ఆర్డినెన్సును కాంగ్రెస్‌, TMC, DMK వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సమర్పించిన నోటీసులను లోక్‌సభ సెక్రటేరియట్ అనుమతించింది.

    ఇండియా కూటమి గురువారం మొదటిసారి సమావేశం అవుతోంది. ఉభయసభల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ముందస్తు సన్నద్ధత కోసం రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఏర్పాటు చేయనున్నారు.

    DETAILS

    అఖిలపక్ష భేటీకి 34 పార్టీల తరఫున ప్రతినిధులు హాజరు

    మరోవైపు విపక్షాలు లేవనెత్తే ఏ అంశంపై అయినా చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

    పార్లమెంట్ ఉభయ సభలను ఆటంకాలు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో బుధవారం సాయంత్రం అఖిలపక్ష భేటీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు 34 పార్టీల తరఫున ప్రతినిధులు హాజరై డిమాండ్లను స్పష్టం చేశారు. మణిపూర్ హింసపై తొలిరోజే ప్రధాని మాట్లాడాలని పట్టుబట్టారు.

    పలు పార్టీలు కుల గణన, నిరుద్యోగం అంశాలపై చర్చ జరగాలని ప్రతిపాదించాయి.

    అన్నింటిపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు సభ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారమే పేర్కొన్నారు. స్పీకర్ షెడ్యూల్ నిర్ణయం మేరకే మణిపూర్ రగడపై చర్చిస్తామని జోషి అన్నారు.

    DETAILS

    తొలి రోజే మణిపూర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామన్న కాంగ్రెస్

    అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మాత్రం పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభ రోజే మణిపూర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని తేల్చి చెప్పింది.

    దిల్లీ ఆర్డినెన్సులను సైతం వ్యతిరేకిస్తామని చెప్పింది. ప్రధాని ప్రకటనకు విపక్షాలు డిమాండ్‌ చేయడం అంటే సభలో గందరగోళ సృష్టికి ఒక సాకుగా జోషి అభివర్ణించారు.

    గత ప్రధానులు పీవీ, వాజ్‌పేయీ, మన్మోహన్‌ హయాల్లో ఏ అంశంపైనైనా చర్చలు నిరంతరంగా సాగేవని విపక్షాలు గుర్తు చేశాయి.

    తెలుగు రాష్ట్రాల పార్టీలు భారాస, వైకాపాలు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని అభ్యర్థించాయి. మరోవైపు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా బుధవారం ఆయా పార్టీల లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. సభ సక్రమంగా సాగేందుకు సహకరించాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    లోక్‌సభ

    తాజా

    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్
    Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు బంగారం
    MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ ముంబయి ఇండియన్స్

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే దిల్లీ

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు ప్రహ్లాద్ జోషి
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    లోక్‌సభ

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా రాజ్యసభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025