రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ; నేడు పార్లమెంట్కు కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరుకానున్నారు. 'మోదీ ఇంటి పేరు' కేసులో రాహుల్పై విధించిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత రాహుల్ గాంధీ తన లోక్సభ సభ్యత్వాన్ని తిరిగి పొందారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కాంగ్రెస్ సిద్ధమన సమయంలో లోక్సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.