IPL 2025: ఐపీఎల్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఫిజికల్ టికెట్స్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 బజ్ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
తొలిమ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.
అలాగే, మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఇదే నెల 23, 27 తేదీల్లో ఉప్పల్ వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ల ఫిజికల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
వివరాలు
ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఫిజికల్ టికెట్లు జారీ
ఐపీఎల్ 2025 టికెట్ జారీ ప్రారంభమైంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఫిజికల్ టికెట్లు జారీ చేయనున్నారు.
సికింద్రాబాద్ జింఖానా స్టేడియం, ECIL స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంతో పాటు హిమాయత్నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అత్తాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్లలో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారు QR కోడ్ లేదా ఆధార్ కార్డు చూపిస్తే టికెట్లు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.