NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శివం దూబేను మరిచారా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శివం దూబేను మరిచారా?
    ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శివం దూబేను మరిచారా?

    IPL 2025: ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శివం దూబేను మరిచారా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 15, 2025
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి గెలుపు బాటలోకి వస్తోంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో జట్టు శక్తివంతంగా పునరాగమనం చేస్తోంది.

    లీగ్‌లో 30వ మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    ఈ విజయంతో సీఎస్కే 7 మ్యాచ్‌లలో రెండో గెలుపును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోని ముఖ్యపాత్ర పోషించాడు.

    11 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టును విజయ తీరానికి చేర్చిన ధోనిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికపై కొన్ని ప్రశ్నలు వెలువడుతున్నాయి.

    Details

    43 పరుగులు చేసిన దూబే

    ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రేసులో ధోనితో పాటు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, సీఎస్కే ఆటగాడు శివం దూబే కూడా ఉన్నారు. సాధారణంగా విజయం సాధించిన జట్టు నుంచే ఈ పురస్కారాన్ని ఎంపిక చేస్తారు.

    ఈ నేపథ్యంలో లక్నో ఓటమిపాలవడంతో పంత్ ఎంపిక కాకపోవడం సహజం. కానీ శివం దూబేకు ఈసారి అన్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    శివం దూబే మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు 76 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన క్లిష్ట సమయంలో అతను క్రీజులోకి వచ్చాడు.

    జడేజా, విజయ్ శంకర్ లు నిరాశపర్చిన వేళ శివం దూబే 37 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేశాడు.

    Details

    సరైన గుర్తింపు రాలేదని విమర్శలు

    దూబే తన బ్యాటింగ్‌తో సీఎస్కేను తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు. ధోని మరోవైపు బౌలింగ్ ఆఖరి దశలో రన్‌రేట్ తగ్గించడంతో పాటు వికెట్ కీపింగ్‌లో అద్భుతంగా రాణించాడు.

    కొన్ని క్యాచ్‌లు పట్టడం, స్టంపింగ్‌లు చేయడం, రనౌట్‌లు చేయడం వంటివి చేసిన ధోనిని ఈ కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

    మ్యాచ్‌లో ఫినిషింగ్ టచ్‌తో పాటు కీపింగ్‌ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ధోనికి ఈ గౌరవం దక్కిందన్న అభిప్రాయం ఉంది.

    అయితే శివం దూబే సమర్ధతపూరిత ప్రదర్శనకు సరైన గుర్తింపు రాలేదనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని
    చైన్నై సూపర్ కింగ్స్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    ఎంఎస్ ధోని

    MS Dhoni Captain: IPL ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా MS ధోని ఎంపిక  క్రీడలు
    Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో  అనంత్ అంబానీ
    IPL 2024: కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోని  క్రీడలు
    MS Dhoni -Gambhir-IPL: ధోనీ చివరి ఓవర్ వరకూ ఉంటే మ్యాచ్ అంతే సంగతులు: గంభీర్ గౌతమ్ గంభీర్

    చైన్నై సూపర్ కింగ్స్

    డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై ఐపీఎల్
    ధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్ ఎంఎస్ ధోని
    చైన్నై వర్సెస్ లక్నో.. గెలుపుపై ఇరు జట్లు ధీమా! లక్నో సూపర్‌జెయింట్స్
    ఉచిత ఐపీఎల్ టికెట్లు.. హర్షం వ్యక్తం చేసిన అభిమానులు ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025