Loading...
India Playing XI: వారికి మళ్లీ నిరాశే.. సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!
వారికి మళ్లీ నిరాశే.. సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI: వారికి మళ్లీ నిరాశే.. సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఆఖరి సమరానికి సిద్దమవుతోంది. శనివారం, విశాఖపట్టణం సముద్రతీరంలో జరిగే డిసైడర్ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య సిరీస్ గెలుపును నిర్ణయించనుంది. రాంచీ వన్డేలో గెలిచి, రాయ్‌పూర్ వన్డేలో ఓటమి పాలైన భారత్, వైజాగ్‌లో తిరిగి విజయం సాధించాలని ఉత్సాహంగా ఉంది. రెండో వన్డేలో 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలబెట్టలేకపోయిన భారత్, చేసిన తప్పిదాలపై దృష్టి పెట్టింది. ఏ పరిస్థితిలోనైనా చివరి మ్యాచ్‌లో గెలుస్తూ సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు, తొలి వన్డేలో అనూహ్యంగా చేజారిన విజయాన్ని రెండో వన్డేలో సౌతాఫ్రికా పొందింది. వ్యూహాత్మకంగా ఆడి, సిరీస్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

వివరాలు 

రిషభ్ పంత్‌కు నిరాశ 

ఆఖరి వన్డేలోనూ సమష్టిగా బలంగా ప్రదర్శన చూపుతూ, టీమిండియాకు మరో పీడకలను మిగిల్చాలని సఫారీ జట్టు సంకల్పించింది.

అందువల్ల, ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడయ్యాయి.

చివరి వన్డేలోనూ టీమిండియా తుది జట్టులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.

శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు.

అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న అతను, రిషభ్ పంత్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్‌లకు బెంచ్‌లోనే ఉండే పరిస్థితిని ఏర్పరుస్తున్నాడు.

మరోవైపు, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరుస రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అతనికి, మూడో వన్డేలో ఆఖరి అవకాశం దొరకనుంది.

వివరాలు 

నితీష్ రెడ్డికి అవకాశం? 

ఒకవేళ జైస్వాల్‌ను తొలగించాలనుకుంటే, రుతురాజ్ గైక్వాడ్‌ను ఓపెనర్‌గా ఆడించాల్సి వస్తుంది.

కానీ ఆ ప్రయత్నం సాహసపూరితంగా ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.

ఇప్పటికే బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు, రోహిత్ శర్మ, జైస్వాల్ కూడా బలంగా ప్రదర్శించాలి.

రుతురాజ్ గైక్వాడ్ తన జోరు కొనసాగిస్తే, భారత్ ఆడగలదు.

తెలుగు ప్రతిభ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేదా బెంచ్‌లోనే పరిమితం చేస్తారా, అనేది చూడాల్సి ఉంది. నితీష్ ఆడితే, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రాకపోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

తుది జట్టు(అంచనా) 

తొలి రెండు వన్డేల్లో సుందర్ అంచనాలను అందుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

రవీంద్ర జడేజా ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. స్పెషల్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ప్రదర్శన చూపాలి.

రెండో వన్డేలో విఫలమైన భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్,హర్షిత్ రాణా,ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ మెరుగుపరచాలి.

ఫీల్డింగ్‌లో కూడా అభివృద్ధి అవసరం. ఇవన్నీ జరిగితే, భారత్ విజయం సాధ్యమే. బెంచ్ ప్లేయర్లు ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, తిలక్ వర్మలకు నిరాశ ఎదురవుతుంది.

తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ,యశస్వి జైస్వాల్,విరాట్ కోహ్లీ,రుతురాజ్ గైక్వాడ్,వాషింగ్టన్ సుందర్/నితీష్ కుమార్ రెడ్డి/,కేఎల్ రాహుల్(కెప్టెన్),రవీంద్ర జడేజా,కుల్దీప్ యాదవ్,ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్,హర్షిత్ రాణా.

ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ

ADVERTISEMENT