LOADING...
IPL 2026: ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. 138 బంతుల్లో ముగిసిన మ్యాచ్.. దుమ్మురేపిన ఆర్సీబీ
ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. 138 బంతుల్లో ముగిసిన మ్యాచ్.. దుమ్మురేపిన ఆర్సీబీ

IPL 2026: ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. 138 బంతుల్లో ముగిసిన మ్యాచ్.. దుమ్మురేపిన ఆర్సీబీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 28, 2026
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో పూర్తైన మ్యాచ్‌ల జాబితాలో మరో మ్యాచ్ చేరింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘన విజయం సాధించింది. ఢిల్లీపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో కేవలం 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చిన ఆర్సీబీ, 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది రెండో వేగవంతమైన విజయవంతమైన రన్‌చేజ్‌గా నిలిచింది. ఈ సందర్భంగా వర్షం కారణంగా తగ్గించిన మ్యాచ్‌లను మినహాయించి, ఐపీఎల్‌లో అత్యల్ప వ్యవధిలో ముగిసిన మ్యాచ్‌లపై ఓ లుక్ వేద్దాం.

వివరాలు

138 బంతుల్లో ముగిసిన మ్యాచ్

ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్ మొత్తం 138 బంతుల్లోనే ముగిసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండో అతి తక్కువ వ్యవధిలో పూర్తైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు, పవర్‌ప్లేలోనే 8 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో ఢిల్లీ, 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ, కేవలం 39 బంతుల్లోనే 76 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వివరాలు

వేగంగా తొలి 6 వికెట్లు కోల్పోయిన జట్టు

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో చెత్త రికార్డును నమోదు చేసింది. జట్టు తొలి ఆరు వికెట్లు కేవలం 3.5 ఓవర్లలోనే పడిపోయాయి. IPL చరిత్రలో ఏ జట్టైనా తొలి ఆరు వికెట్లు ఇంత వేగంగా కోల్పోవడం ఇదే తొలిసారి. హోం జట్టు ఢిల్లీ 8/6 స్కోరుకు చేరగా, పవర్‌ప్లే ముగిసే సమయానికి 13/6గా నిలిచింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పవర్‌ప్లే స్కోరుగా నమోదైంది. ఈ దశలో భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్ చెరో మూడు వికెట్లు తీశారు.

Advertisement

వివరాలు

125 బంతుల్లో ముగిసిన మ్యాచ్ - MI vs KKR, 2008

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ అతి తక్కువ సమయంలో పూర్తైన మ్యాచ్‌గా 2008లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్ మధ్య జరిగిన పోరు నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ మొత్తం 125 బంతుల్లో ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు దారుణంగా ఆడి 15.2 ఓవర్లలో కేవలం 67 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై తరఫున షాన్ పోలాక్ మూడు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్, 68 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సనత్ జయసూర్య 17 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు.

Advertisement