Page Loader
PV Sindhu:సయ్యద్ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం.. ఫైనల్‌కు అర్హత 
సయ్యద్ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం.. ఫైనల్‌కు అర్హత

PV Sindhu:సయ్యద్ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం.. ఫైనల్‌కు అర్హత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2024
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో పివి.సింధు అద్భుత ప్రదర్శన చేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో, భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి.సింధు, 17 ఏళ్ల ఉన్నతి హుడాపై 21-12, 21-9తో గెలుపొందింది. సింధు తన దూకుడైన ఆటతో ఈ మ్యాచును కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ, తనీషా క్రాస్టో మరియు ధ్రువ్ కపిల కూడా ఫైనల్‌కు చేరుకున్నారు. ఐదో సీడ్‌గా ఉన్న ఈ జోడీ, 21-16, 21-15తో నాలుగో సీడ్ హాంగ్ జౌ, జియా యి యాంగ్ (చైనా) జోడీని వరుస గేమ్‌లలో ఓడించి, 42 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో విజయం సాధించారు.