Ishan Kishan: విరాట్, కోహ్లీ ఎప్పుడూ అలా చేయలేదు.. కానీ ఇషాన్ ఎందుకలా?: పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్
ఇషాన్ కిషన్ గత నెల నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్తో జరిగుతున్న టీ20 సిరీస్లో కూడా అతను భాగం కాదు. కొద్ది రోజుల క్రితం ఇషాన్ కిషన్ విశ్రాంతి తీసుకోవడం కోసం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత అతను టీమ్ ఇండియా ఆడుతున్న మ్యాచ్లకు దూరమవుతూ వస్తున్నాడు. అయితే ఇషాన్ కిషన్ విశ్రాంతి తీసుకోవడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్లో ఆయన మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నట్లు చాలా రోజులుగా నేను వింటున్నట్లు చెప్పారు.
క్రికెట్ అనేది ఒక జాతీయ కర్తవ్యం: ఉమర్ అక్మల్
ఇషాన్ కిషన్ మానసిక ఒత్తిడికి గురైనట్లు తాను విన్నానని, అయితే ఈ వయసులో అతను ఎలాంటి ఒత్తిడికి గురవుతాడని ఉమర్ అక్మల్ ప్రశ్నించారు. అదే టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారని, వారు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారన్నారు. అయితే ఈ ముగ్గురూ మానసిక ఒత్తిడి కారణంగా విరామం తీసుకుంటున్నట్లు తానెప్పుడూ వినలేదన్నారు. మానసిక అలసట కారణంగా మీకు కావలసినప్పుడు విశ్రాంతి తీసుకోలేమని విషయాన్ని ఆటగాళ్లు తెలుసుకోవాలన్నారు. క్రికెట్ అనేది ఒక జాతీయ కర్తవ్యమని ఉమర్ అక్మల్ అభిప్రాయపడ్డారు. అందుకే ఆగటాళ్లు తమంతట తాము విశ్రాంతి కోరలేరన్నారు.