Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కొత్త ఇన్నింగ్స్.. యూరోప్ టీ20 జట్టుకు యజమానిగా 'ది వాల్'
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కొత్త అవతారంలో కనిపించాడు. త్వరలో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్(ETPL)లో ఆయన ఒక ఫ్రాంచైజీ యజమానిగా మారాడు. డబ్లిన్ గార్డియన్స్ జట్టును ద్రవిడ్ సొంతం చేసుకున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. 2026లో ప్రారంభం కానున్న ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు ఉండగా, ద్రవిడ్ చేరికతో అన్ని ఫ్రాంచైజీల కూర్పు పూర్తయింది. డబ్లిన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ద్రవిడ్ను డబ్లిన్ ఫ్రాంచైజీ యజమానిగా అధికారికంగా పరిచయం చేశారు. ఈ ఈవెంట్కు ETPL సహ వ్యవస్థాపకులు అభిషేక్ బచ్చన్, సౌరవ్ గంగూలీతో పాటు ఇతర ఫ్రాంచైజీ యజమానులు జాంటీ రోడ్స్, గ్లాస్గో ఫ్రాంచైజీ యజమాని విపుల్ అగర్వాల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
వివరాలు
యువ ప్లేయర్ల ప్రతిభను బయటికి తీసుకురావాలి
అలాగే ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఐసీసీ ఆమోదం పొందిన ఈ లీగ్లో డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బరో, గ్లాస్గో, ఆమ్స్టర్డామ్, రోటర్డామ్ నగరాల జట్లు పోటీపడనున్నాయి. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, యూరోప్లో క్రికెట్ను అభివృద్ధి చేయడం, యువ ప్రతిభను ప్రోత్సహించడం అనే విజన్ తనను ఈ లీగ్ వైపు ఆకర్షించిందని తెలిపారు. డబ్లిన్లో ఇప్పటికే క్రికెట్పై ఆసక్తి ఉన్న కమ్యూనిటీ ఉందని, వారికి మద్దతుగా నిలవడం తనకు ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఈ లీగ్ పాల్గొననున్నా స్టార్ ప్లేయర్లు
ఇక అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ, ద్రవిడ్ వంటి దిగ్గజం ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం ప్రత్యేకమని, ఇది యూరోప్లో తదుపరి తరం క్రికెటర్లను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ఈ లీగ్లో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఆడనున్నారు. అలాగే స్టీవ్ వా, క్రిస్ గేల్, జొంటీ రోడ్స్ వంటి దిగ్గజాలు కూడా వివిధ ఫ్రాంచైజీలతో భాగస్వాములుగా ఉండటం ఈ లీగ్కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.