NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
    డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
    క్రీడలు

    డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2023 | 06:04 pm 1 నిమి చదవండి
    డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
    టీమిండియా ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

    ప్రస్తుతం ఐపీఎల్ చివరి మ్యాచులు జరుగుతున్నాయి. వీటి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే టీమిండియా తొలి బ్యాచ్ ఇంగ్లండ్ కుపయనమైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో తలపడే భారత్ ప్లెయింగ్ ఎలెవన్ ను భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంపిక చేశాడు. తన జట్టులో అంజిక్యా రహానేకు అవకాశం కల్పించాడు. లండన్ లోని ఓవల్ లో ఈ డబ్య్లూటీసీ ఫైనల్ జరగనుంది. అయితే ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన రహానేకు ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే.

    రవిశాస్త్రి అంచనా వేసిన జట్టు ఇదే

    ఇక రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మాన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరం కావడంతో అతని స్థానంలో కీపింగ్ బాధ్యతలను కేఎస్ భరత్ కు అప్పగిస్తారని వెల్లడించారు. టీమిండియాకు కీలకమైన నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, అయితే శార్దూల్ మాత్రం ఆల్ రౌండర్‌గా బరిలోకి దిగుతాడని చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి అంచనా వేసిన ఇండియా ప్లేయింగ్ XI ఇదే.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    టీమిండియా
    క్రికెట్

    టీమిండియా

    వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం! ఐసీసీ
    ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్  పాకిస్థాన్
    ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. ఏసీసీకి పాక్ బోర్డు బెదిరింపులు పాకిస్థాన్

    క్రికెట్

    ఎంఎస్ ధోనిపై నిషేధం.. ఫైనల్  మ్యాచ్‌కు దూరం..? ఎంఎస్ ధోని
    వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ ఐసీసీ
    పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ ఐపీఎల్
    ఐపీఎల్ 2023లో బౌలర్ల హవా మామూలుగా లేదుగా.. లిస్టులో ఎవరున్నారంటే? ఐపీఎల్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023