LOADING...
JioHotstar Record Views: భార‌త్‌-న్యూజిలాండ్ మ్యాచ్ కు ఓటీటీలో రికార్డు వ్యూస్
భార‌త్‌-న్యూజిలాండ్ మ్యాచ్ కు ఓటీటీలో రికార్డు వ్యూస్

JioHotstar Record Views: భార‌త్‌-న్యూజిలాండ్ మ్యాచ్ కు ఓటీటీలో రికార్డు వ్యూస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ వేదికలపై భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా వీక్షణల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. మ్యాచ్ చివరి దశలో వ్యూస్ సంఖ్య దాదాపు 78.5 కోట్లకు చేరి కొత్త మైలురాయిని నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టు టీమిండియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలోనే జియో హాట్‌స్టార్‌లో వీక్షణల సంఖ్య సుమారు 58.3 కోట్లుగా నమోదైంది. మ్యాచ్ క్రమంగా ఉత్కంఠభరితంగా మారుతుండటంతో ప్రేక్షకుల సంఖ్య కూడా వేగంగా పెరిగింది.

Details

సీఫ‌ర్ట్ ఔటైన స‌మ‌యంలో ఎక్కువ‌మంది వీక్షకులు

ప్రత్యేకంగా న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ ఔటైన సమయంలో వీక్షణల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఆ సమయంలో మొత్తం వ్యూస్ సుమారు 63.2 కోట్లకు చేరుకున్నాయి. ఆ వికెట్ తరువాత మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గుచూపడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మ్యాచ్ చివరి క్షణాల్లో వీక్షణల సంఖ్య మరింతగా పెరిగింది. భారత్ విజయం ఖరారవుతున్న సమయంలో జియో హాట్‌స్టార్‌లో వ్యూస్ దాదాపు 80 కోట్లకు చేరువయ్యాయి. భారత్ విజయం నిర్ధారించిన చివరి క్యాచ్ పట్టిన సమయంలోనే వీక్షణల సంఖ్య 74.5 కోట్లుగా నమోదైనట్లు సమాచారం.

Details

96 పరుగుల తేడాతో ఘన విజయం

ఈ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా, ఇదే టోర్నీలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా భారీ స్పందన లభించింది. ఐసీసీ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఆ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి సుమారు 6.52 కోట్ల మంది వీక్షించారు. ఈ గణాంకాలు భారత్‌లో క్రికెట్‌కు ఉన్న అపార ప్రజాదరణను స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా ఆడే కీలక మ్యాచ్‌లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రేక్షకుల స్పందన భారీగా పెరుగుతున్నట్లు ఈ రికార్డులు తెలియజేస్తున్నాయి.

Advertisement