NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ..

    WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    11:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) - 2025 టోర్నమెంట్ గ్రాండ్‌గా ఆరంభమైంది.

    తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) జట్ల మధ్య జరిగింది.

    ఈ మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. అయితే చివరకు విజయాన్ని బెంగళూరు జట్టు అందుకుంది.

    డబ్ల్యూపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించింది.

    రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చింది. కేవలం 27 బంతుల్లోనే ఏడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

    వివరాలు 

    ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బలు

    టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

    బెత్ మూనీ (56), ఆష్లే గార్డ్‌నర్ (79 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో గుజరాత్ ఈ స్కోర్ సాధించగలిగింది.

    భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

    14 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు - స్మృతి మంధాన, డానీ వ్యాట్ - గార్డ్‌నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.

    దీంతో ఆర్సీబీ ఓటమి అంచున ఉన్నట్లు కనిపించినా, ఎలీస్ పెర్రీ (57) సమయోచిత ఇన్నింగ్స్ ఆడి, రిచా ఘోష్ తోడుగా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడటంతో, ఆర్సీబీ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.

    వివరాలు 

    ఇంతకుముందు ముంబై ఇండియన్స్ పేరిట రికార్డు

    ఈ విజయంతో ఆర్సీబీ మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది.

    డబ్ల్యూపీఎల్‌లో 200కుపైగా పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేజిక్కించుకున్న మొదటి జట్టుగా కూడా రికార్డు సాధించింది.

    ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది.

    2024లో గుజరాత్ జెయింట్స్ పై 191 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఛేదించిన సంగతి తెలిసిందే.

    ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ విజయాల్లో నలుగురు గుజరాత్ జట్టుపైనే నమోదవడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

    RCB - THE DEFENDING CHAMPIONS.

    - What a blockbuster start to WPL 2025. 🌟pic.twitter.com/sWoG06Hz10

    — Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి ప్రేరణ
    WTC 2023-25 Team of the Tournament : విరాట్, రోహిత్ శర్మకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జైస్వాల్, బుమ్రా ఎంపిక  టీమిండియా
    Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    IPL 2025 Final: నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయం‌పై విజయ్ మాల్యా హర్షం! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఐపీఎల్

    IPL Retention: రిటెన్షన్‌లో సన్ రైజర్స్ సంచలనం.. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు,మిగతా ప్లేయర్లకు భారీ ఆఫర్లు! సన్ రైజర్స్ హైదరాబాద్
    IPL: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. ఏ జట్లు ఎవరిని నిలుపుకున్నాయో తెలుసా?  క్రికెట్
    IPL 2025 Auction:  రియాద్‌లో ఐపీఎల్‌ 2025 మెగా వేలం.. వేదిక, డేట్లు ఇవేనా? క్రీడలు
    IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ వచ్చేసింది.. వేలంలో 1574 మంది ఆటగాళ్లు క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025