
Rishita: ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్లో వరుసగా మూడో టైటిల్ గెలిచిన రిషిత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ బసిరెడ్డి రిషిత రెడ్డి, ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్లో వరుసగా మూడో టైటిల్ సాధించింది.
పుణెలో ఆదివారం జరిగిన జె100 టోర్నమెంట్ గర్ల్స్ సింగిల్స్ ఫైనల్లో జపాన్కు చెందిన అవొయి వటానబెపై 6-2, 7-5తో గెలుపొందింది.
దీంతో రిషిత హ్యాట్రిక్ టైటిల్స్ సాధించి రికార్డు సృష్టించింది. గత రెండు వారాల్లో రిషిత గువాహతి, దిల్లీలో జరిగిన ఐటీఎఫ్ జె60, జె1 టోర్నమెంట్లలోనూ విజేతగా నిలిచింది.
ఇలా మూడు వారాల్లో వరుసగా మూడు టైటిల్స్ సాధించడం ఆమెకు విశేషమైన ఘనతగా నిలిచింది.
Details
ఏడు అంతర్జాతీయ ట్రోఫీలను గెలిచిన రిషిత
జూనియర్ విభాగంలో రిషిత ఇప్పటివరకు ఏడు అంతర్జాతీయ ట్రోఫీలను గెలుచుకుని తన ప్రతిభను చాటుకుంది.
యువ టెన్నిస్ క్రీడాకారిణిగా అంతర్జాతీయ వేదికపై ఆడుతూ, తన స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు రిషిత ప్రయత్నిస్తోంది.
తెలంగాణ క్రీడాకారిణిగా తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతూ, టెన్నిస్లో భారత దేశానికి మరిన్ని విజయాలను అందించేందుకు కృషి చేస్తోంది.