
All-Time XI: వరుణ్ ప్లేయింగ్ ఎలెవన్లో రోహిత్, కోహ్లీకి స్థానం లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. కేవలం మూడు మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి తన బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్, ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇందులో భాగంగా తన ఆల్టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. అయితే ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చోటు దక్కకపోవడం విశేషం. అశ్విన్ పెట్టిన షరతు ప్రకారం వరుణ్ తనతో కలసి ఆడిన ఆటగాళ్ల నుంచే జట్టును ఎంచుకోవాల్సి ఉండడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
Details
వరుణ్ చక్రవర్తి సెలెక్ట్ చేసిన జట్టు ఇదే
భారత్ తరఫున వరుణ్ ఎంపిక చేసిన ముగ్గురు క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా. గమనించాల్సింది ఏంటంటే, వరుణ్ తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో చేశాడు. అలాగే వన్డేల్లో తొలి మ్యాచ్ 2025లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాడు. అయినప్పటికీ వీరిద్దరికీ తన ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వలేదు. జట్టు జోస్ బట్లర్, ట్రావిస్ హెడ్, సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మతిశా పతిరనా