Page Loader
On This Day:  శ్రీలంకపై రోహిత్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు.. ఇప్పటికీ 'పది'లం
శ్రీలంకపై రోహిత్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు.. ఇప్పటికీ 'పది'లం

On This Day:  శ్రీలంకపై రోహిత్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు.. ఇప్పటికీ 'పది'లం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులు నమోదు చేసుకున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 264 పరుగులతో రోహిత్ సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ రికార్డు క్రింద అతను అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు.

వివరాలు 

రోహిత్ శర్మ 264 రికార్డు 

2014లో, శ్రీలంక భారతదేశంలో పర్యటించగా, ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 5-0తో విజయాన్ని అందుకుంది. నాలుగో వన్డేలో ఈ విజయం మరింత విశేషంగా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 404 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 264 పరుగులు చేయడం, సిరీస్‌లో బాటింగ్‌తో చెరగని ముద్ర వేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్‌లు బాదాడు. అతడి బ్యాటింగ్‌తో వన్డే చరిత్రలో రికార్డు స్థాయి స్కోరు సృష్టించాడు.

వివరాలు 

రోహిత్ ద్విశతకాలు 

ఇప్పటివరకు, రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించారు. 2013లో ఆయన ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగులతో రికార్డు స్థాయిలో నిలిచాడు. 2017లో తిరిగి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 208 పరుగులతో తన మూడవ డబుల్ సెంచరీని సాధించాడు. ఈ మూడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు రోహిత్ శర్మను వన్డే క్రికెట్‌లో ఒక ప్రత్యేకమైన స్థాయికి తీసుకెళ్లాయి.

వివరాలు 

రికార్డు స్థాయిలో జట్టు విజయం 

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అవిరామంగా ఆడినప్పటికీ, అతడికి సహకరించిన అనేక ఆటగాళ్లు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ 66 పరుగులతో, రాబిన్ ఉతప్ప 16* పరుగులతో తన భాగస్వామ్యాన్ని అందించారు. చివరగా శ్రీలంక 251 పరుగులకు ఆలౌటైంది, భారత బౌలర్లు ధవల్ కులకర్ణి (3/34), ఉమేశ్ యాదవ్ (2/38), స్టువర్ట్ బిన్నీ (2/55), అక్షర్ పటేల్ (2/51) రాణించి విజయం సాధించారు. ఈ విజయంతో రోహిత్ శర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా అందుకున్నారు.

వివరాలు 

రోహిత్ రికార్డు 

రోహిత్ శర్మ 264 పరుగుల స్కోరు వన్డేల్లో ఇప్పటికీ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలుస్తోంది. అయితే, 2015లో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 234 పరుగులు చేసినా, రోహిత్ రికార్డును మాత్రం టచ్‌ చేయలేకపోయాడు. ఈ విధంగా రోహిత్ శర్మ తన రికార్డులతో భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు.