Page Loader
Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ.. 
మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..

Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి మర్యాద పూర్వకంగా సమావేశం కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ముంబయిలోని సీఎం అధికారిక నివాసమైన 'వర్ష'లో రోహిత్ శర్మ ఫడ్నవీస్‌ను కలిసారు. ఈ భేటీ అనంతరం ఫడ్నవీస్ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.

వివరాలు 

రోహిత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు

"భారత క్రికెట్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన రోహిత్ శర్మను నా నివాసమైన వర్షలో కలవడం సంతోషంగా ఉంది. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయనకు భవిష్యత్తులో మరింత విజయాలు అందాలని ఆకాంక్షిస్తున్నాను," అంటూ ఆయన రోహిత్‌తో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. సీఎంతో రోహిత్ సమావేశమయ్యారు, ఫొటోలు బయటకొచ్చాయి. వెంటనే రోహిత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మోత మోగించాయి. సోషల్ మీడియా అంతా ఈ అంశం చుట్టూ గిరగిరా తిరుగుతుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దాదాపు 11 సంవత్సరాల పాటు భారత టెస్ట్ జట్టులో కొనసాగిన రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.

వివరాలు 

11 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌ల్లో 4301 పరుగులు 

ఆయన 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌పై అద్భుతమైన డెబ్యూ ఇన్నింగ్స్ ఆడి, తన తొలి టెస్టులోనే 177 పరుగులు చేసి మెరిశారు. మొత్తంగా 67 టెస్టులు ఆడిన రోహిత్, 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. 2019లో భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 212 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 16వ స్థానాన్ని రోహిత్ ఆక్రమించారు. అయితే, కెరీర్ ఆరంభంలో రోహిత్‌కు స్థిరమైన స్థానం దక్కించడం కొంత క్లిష్టంగా మారింది.

వివరాలు 

దక్షిణాఫ్రికాపై వరుసగా శతకాలు

2013 నుంచి 2018 మధ్య కాలంలో కేవలం 27 టెస్టులు మాత్రమే ఆడి, 47 ఇన్నింగ్స్‌లలో 39.63 సగటుతో 1,585 పరుగులు చేశారు. ఈ కాలంలో మూడు శతకాలు, పదిహేను అర్ధశతకాలు నమోదు చేశారు. 2019లో ఇన్నింగ్స్ ఓపెనర్ బాధ్యతలు స్వీకరించిన రోహిత్, టెస్ట్ కెరీర్‌ను మళ్లీ మలుపు తిప్పారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై వరుసగా శతకాలు బాదడం ద్వారా తన క్లాస్‌ను మరోసారి నిరూపించారు. అనంతరం జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో రోహిత్ 40 టెస్టుల్లో పాల్గొని, 41.15 సగటుతో మొత్తం 2,716 పరుగులు సాధించారు. ఈ సమయంలో ఆయన తొమ్మిది శతకాలు, ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశారు.

వివరాలు 

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 10వ స్థానంలో రోహిత్ 

డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా, అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచారు. అంతర్జాతీయంగా ఈ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 10వ స్థానంలో స్థానం సంపాదించారు. 2023లో యూకేలో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్, ఆ మ్యాచ్‌లో జట్టు ఓటమి పాలైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేవేంద్ర ఫడణవీస్‌ చేసిన ట్వీట్