LOADING...
GT vs SRH: ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన సాయి సుదర్శన్..వరుసగా 3 సీజన్లలో 500 పరుగులు
ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన సాయి సుదర్శన్..వరుసగా 3 సీజన్లలో 500 పరుగులు

GT vs SRH: ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన సాయి సుదర్శన్..వరుసగా 3 సీజన్లలో 500 పరుగులు

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శనతో మరో కీలక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 44 బంతుల్లో 61 పరుగులు సాధించిన అతడు, ఈ సీజన్‌లో 500 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో 2024, 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో వరుసగా 500కిపైగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే ఘనతను గతంలో విరాట్ కోహ్లీ 2023 నుంచి 2025 మధ్య నమోదు చేశాడు. ఇప్పుడు సాయి సుదర్శన్ ఆ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో అతడు చోటు సంపాదించాడు.

వివరాలు

ఆరెంజ్ క్యాప్ రేసులో సుదర్శన్ టాప్..

ఈ కీలక ఇన్నింగ్స్‌తో సాయి సుదర్శన్ ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 41.75 సగటుతో 501 పరుగులు నమోదు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్‌లో 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న సుదర్శన్, ఈసారి కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ మరోసారి ఆ అవార్డు దిశగా దూసుకెళ్తున్నాడు.

వివరాలు

వరుస సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్లే..

ఐపీఎల్‌లో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కిపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది: డేవిడ్ వార్నర్ - 6 సీజన్లు కేఎల్ రాహుల్ - 5 సీజన్లు క్రిస్ గేల్ - 3 సీజన్లు శిఖర్ ధావన్ - 3 సీజన్లు విరాట్ కోహ్లీ - 3 సీజన్లు సాయి సుదర్శన్ - 3 సీజన్లు

Advertisement