LOADING...
Sanjeev Goenka: పంత్‌తో వాగ్వాదం? క్లారిటీ ఇచ్చిన గోయెంకా
పంత్‌తో వాగ్వాదం? క్లారిటీ ఇచ్చిన గోయెంకా

Sanjeev Goenka: పంత్‌తో వాగ్వాదం? క్లారిటీ ఇచ్చిన గోయెంకా

వ్రాసిన వారు Moogati Shabari
Apr 02, 2026
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిషభ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌తో ఆయన మైదానంలో తీవ్రంగా మాట్లాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

వివరాలు 

ఆ అనుమానాలకు చెక్

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 141 పరుగులకే పరిమితమైంది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ జట్టు ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో, ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని సులభంగా అందుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో గోయెంకా, కెప్టెన్ పంత్‌తో గంభీరంగా చర్చిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో కనిపించాయి. దీంతో జట్టులో అంతర్గత సమస్యలు ఉన్నాయేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితిలో గోయెంకా 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ అన్ని ఊహాగానాలకు తెరదీశారు.

వివరాలు 

జట్టుపై నమ్మకం ఉంది..

ఇది చాలా దీర్ఘకాలిక సీజన్ అని, ఒక బలమైన జట్టును నిర్మించే ప్రయాణంలో ఇలాంటి సందర్భాలు సహజం అని అన్నారు. తమ కెప్టెన్‌తో పాటు మొత్తం జట్టు మళ్లీ బలంగా తిరిగి నిలబడుతుందనే నమ్మకం ఉందన్నారు. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మెరుగైన ప్రదర్శనతో తిరిగి వస్తామని, ఈ సీజన్‌లో లక్నో ప్రయాణం ఇంకా కొనసాగుతుందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. వీడియో ద్వారా ఆయన జట్టు గురించి, కెప్టెన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement