LOADING...
Sanju Samson: వరుస వైఫల్యాల తర్వాత సంజూకు మరో ఛాన్స్‌.. నమీబియా మ్యాచ్‌ కీలకం
వరుస వైఫల్యాల తర్వాత సంజూకు మరో ఛాన్స్‌.. నమీబియా మ్యాచ్‌ కీలకం

Sanju Samson: వరుస వైఫల్యాల తర్వాత సంజూకు మరో ఛాన్స్‌.. నమీబియా మ్యాచ్‌ కీలకం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అభిషేక్‌ శర్మకు ఇటీవల ఉదర సంబంధిత ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు డిశ్చార్జ్‌ అయినప్పటికీ, పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో నమీబియాతో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కోలుకోని అభిషేక్ శర్మను ఆడించడంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రిస్క్‌ తీసుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అందుకే ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

వివరాలు 

వరుసగా విఫలమై.. దూరమై..

పొట్టి ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో సంజూ శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆ సిరీస్‌లో అతడు చేసిన స్కోర్లు వరుసగా 10, 6, 0, 24, 6 మాత్రమే. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 46 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా ప్రపంచకప్‌ తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోనూ అతడు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో లేకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ఇషాన్‌ కిషన్‌ తన స్థానాన్ని జట్టులో బలంగా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

వివరాలు 

మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా?

క్రికెట్‌ కెరీర్‌లో ఫామ్‌ కోల్పోవడం సహజమే అయినా, ఎంత త్వరగా తిరిగి పుంజుకుంటాడన్నదే అసలు పరీక్ష. ముఖ్యంగా తీవ్ర పోటీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి అవకాశం ఎంతో కీలకం. ఒకవేళ నమీబియాతో జరిగే మ్యాచ్‌లో సంజూకు అవకాశం లభిస్తే, తప్పక ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా విఫలమైతే అతడి అవకాశాలు దాదాపుగా ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే తుది జట్టులో చోటు కోల్పోయిన సంజూ, ఇలాగే నిరాశాజనక ఫామ్‌ను కొనసాగిస్తే 15 మంది సభ్యుల జాబితాలోనూ అతడి పేరు లేకపోయే ప్రమాదం ఉందని అభిమానులు, క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement