LOADING...
Sanju vs pant : 2027 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో పంత్‌కు చోటు లేదా? గంభీర్ ప్లాన్‌తో సంజూ శాంసన్‌ ఎంట్రీ?
2027 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో పంత్‌కు చోటు లేదా? గంభీర్ ప్లాన్‌తో సంజూ శాంసన్‌ ఎంట్రీ?

Sanju vs pant : 2027 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో పంత్‌కు చోటు లేదా? గంభీర్ ప్లాన్‌తో సంజూ శాంసన్‌ ఎంట్రీ?

వ్రాసిన వారు Moogati Shabari
May 05, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది జరిగే వన్డే సిరీస్‌లు, 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు దూరమైన రిషబ్ పంత్‌ను, ఇప్పుడు వన్డే జట్టులోనుంచి కూడా తప్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతని స్థానాన్ని ప్రస్తుతానికి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌తో భర్తీ చేయడం మంచిదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

వివరాలు

సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌..

గత టీ20 ప్రపంచ కప్ నాకౌట్ దశలో మెరుగైన ప్రదర్శనతో భారత్ టైటిల్ సాధించడంలో సంజూ శాంసన్ ముఖ్య పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను ఐపీఎల్ 2026లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సంజూ, కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 304 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు ఉండటం విశేషం. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడుతూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

వివరాలు

పంత్‌కు నిరాశ..

మరోవైపు, లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లోనూ, నాయకత్వంలోనూ అతను విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం 189 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టు పాయింట్ల పట్టికలో దిగువన ఉండటం కూడా అతని ఫామ్‌పై ప్రభావం చూపింది. ఈ పరిస్థితులు పంత్ వన్డే కెరీర్‌కు ప్రతికూలంగా మారాయి.

Advertisement

వివరాలు

టెస్టులకే పరిమితం అవుతాడా?

పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో (ODI, T20) పంత్ స్థానం సందిగ్ధంగా మారినప్పటికీ, టెస్టు క్రికెట్‌లో మాత్రం అతడిపై సెలెక్టర్ల నమ్మకం కొనసాగుతోంది. టెస్టుల్లో అతని ప్రదర్శనలు బలంగా ఉండటంతో, అతడిని ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే, వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నీల కోసం సంజూ శాంసన్‌ను ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్‌గా సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది.

Advertisement

వివరాలు

భవిష్యత్ వ్యూహం అదేనా?

2027 ప్రపంచ కప్ వరకు జట్టులో స్థిరత్వం తీసుకురావాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లలో ఒకరిని రెగ్యులర్ వికెట్ కీపర్‌గా, మరొకరిని బ్యాకప్‌గా ఉంచడం ద్వారా జట్టు సమతూకం కాపాడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంజూ క్లీన్ హిట్టింగ్ సామర్థ్యం వన్డేల్లో మధ్య ఓవర్లలో జట్టుకు పెద్ద బలం అవుతుంది. రిషబ్ పంత్ ఒక ప్రతిభావంతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే సంజూ శాంసన్‌కు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. సెలెక్టర్లు తీసుకునే నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపనుంది. సంజూ అభిమానులకు మాత్రం ఇది సంతోషకరమైన పరిణామమే!

Advertisement