NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!
    ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!

    World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 09, 2025
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ (WTC) ఫైన‌ల్‌కు రంగం సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే లండన్‌ చేరుకుంది.

    జూన్ 11న లార్డ్స్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు శిక్షణ కొనసాగించేందుకు శనివారం మైదానానికి చేరిన ఆ జట్టుకు ఓ ఊహించని అనుభవం ఎదురైంది.

    శిక్షణ కోసం వెళ్లిన ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం దక్కలేదు.

    లార్డ్స్‌ మైదానంలో శిక్షణ కోసం అవసరమైన అనుమతి ఆ జట్టుకు అందకపోవడంతో ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు.

    తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టుల ప్రకారం, శనివారం అదే సమయంలో భారత జట్టు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో ఆసీస్‌కు ఎంట్రీ ఇవ్వలేదని ఫాక్స్ క్రికెట్ పేర్కొంది.

    Details

    ఆస్ట్రేలియా జట్టుకు అనుమతి లేదు

    ఇటీవలే భారత్ జట్టు కూడా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా అక్కడికి చేరింది. జూన్ 20 నుంచి ప్రారంభంకానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత్ శనివారం లార్డ్స్‌లో శిక్షణలో పాల్గొంది.

    అప్పటికే భారత జట్టుకు మైదానంలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. దీంతో అదే సమయంలో వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు పర్మిషన్ లభించలేదు. అయితే ఆదివారం పరిస్థితి మారింది.

    ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆస్ట్రేలియా జట్టు లార్డ్స్‌లోనే శిక్షణ కొనసాగించింది.

    Details

    జూన్ 20 నుంచి ఆరంభం

    వాస్తవానికి డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌ తొలి రోజు జూన్ 11 కాగా, భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు జూన్ 20 నుంచి ఆరంభం కాబోతుంది.

    అయినప్పటికీ శనివారం భారత జట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటనను చాలా మంది ఆశ్చర్యంగా స్వీకరిస్తున్నారు.

    అంత కీలకమైన మ్యాచ్‌కు సిద్ధమవుతున్న జట్టుకు మైదానంలో ప్రాక్టీస్ కు అవకాశం లేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా

    తాజా

    World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ! ఆస్ట్రేలియా
    Team india: పేస్‌ కాకుండా కంట్రోల్‌ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా టీమిండియా
    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల! సాయి ధరమ్ తేజ్
    Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!  నితిన్

    ఆస్ట్రేలియా

    BGT 2024-25: ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. జట్టులోకి వరల్డ్‌కప్ విన్నర్.. బ్యూ వెబ్‌స్టర్ క్రీడలు
    AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. రెండో రోజు ముగిసిన ఆట.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే టీమిండియా
    Border - Gavaskar Trophy: "మనస్తాపం చెందిన సునీల్ గవాస్కర్": క్రికెట్ ఆస్ట్రేలియాపై మాజీ కెప్టెన్ క్లార్క్‌ విమర్శలు క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025