Page Loader
shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా
పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా

shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) అత్యుత్తమంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని భారత మాజీ క్రికెటర్‌ సురేష్ రైనా ప్రశంసించారు. గత ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) జట్టును విజేతగా నిలిపిన శ్రేయస్‌.. ఈసారి పంజాబ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ అతనిని కొనుగోలు చేయడం కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు వెచ్చించింది. ఆ మొత్తానికి న్యాయం చేస్తూ, ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 50.63 సగటుతో మొత్తం 405 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైనా మాట్లాడుతూ - "శ్రేయస్‌ అయ్యర్‌ డ్రెస్సింగ్‌ రూంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాడు.

Details

ఆ జట్టుకు అదృష్టం కలిసి రావడం లేదు

జట్టులోని ఆటగాళ్లలో గెలిచే ఆత్మవిశ్వాసం, పట్టుదలను నింపుతున్నాడు. కోచ్‌గా రికీ పాంటింగ్‌ కూడా అద్భుతంగా జట్టును మద్దతిస్తున్నాడు. ప్రభుసిమ్రన్‌ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య అదిరే ఆరంభాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత శ్రేయస్‌ ఆయా ఇన్నింగ్స్‌ను బలంగా నడిపిస్తున్నాడని అన్నారు. "ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 200కి పైగా పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దైంది. మరోవైపు ధర్మశాలలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పంజాబ్‌ 10.1 ఓవర్లకు ఒక వికెట్‌ నష్టానికి 124 పరుగులతో పటిష్ట స్థితిలో ఉండగానే ఆ మ్యాచ్‌ కూడా అర్ధంతరంగా నిలిచింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ జట్టుకు అదృష్టం కలిసి రావడం లేదని రైనా అభిప్రాయపడ్డారు.