PV Sindhu: ప్రిక్వార్టర్లో సింధుకు నిరాశ.. క్వార్టర్లో ఆయుశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. ఆయుష్ శెట్టి మినహా మిగతా భారత ఆటగాళ్లు అందరూ ప్రిక్వార్టర్ ఫైనల్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పివి.సింధు 18-21, 8-21 స్కోరుతో రెండో సీడ్ వాంగ్ Zhiyi చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ఉన్నతి హూడా 17-21, 9-21తో టోమోకా మియాజాకికు పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్లో మాత్రం భారత్కు కొంత ఊరటనిచ్చింది ఆయుశ్ శెట్టి ప్రదర్శన. ప్రపంచ 25వ ర్యాంకర్ అయిన అతను 21-16, 21-12తో ప్రపంచ 20వ ర్యాంకర్ చౌ టియన్ చెన్నై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
వివరాలు
మయు మత్సుమోటో జంట చేతిలో పరాజయం
ఇక హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12-21, 19-21తో వెంగ్ హాంగ్యాంగ్ చేతిలో ఓటమి చెందాడు. మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో - ధ్రువ్ కపిల జోడీ 13-21, 14-21తో నాలుగో సీడ్ చెన్ టాంగ్ జీ - తో ఈ వీ జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్లో శ్రుతి మిశ్రా - ప్రియా కొంజెంగ్బామ్ జోడీ 10-21, 13-21తో యుకీ ఫుకుషిమా - మయు మత్సుమోటో జంట చేతిలో పరాజయం చవిచూసింది.