Asian Games 2026: శ్రీచరణి, షెఫాలి విధ్వంసం.. జపాన్పై భారత్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. తాజాగా జపాన్తో జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత భారత బౌలర్లు జపాన్ ఇన్నింగ్స్ను కేవలం 57 పరుగులకే కుప్పకూల్చగా.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు కేవలం 30 బంతుల్లోనే ఛేదించారు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్స్లోకి అధికారికంగా ప్రవేశించింది.
వివరాలు
అదరగొట్టిన శ్రీ చరణి
టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. కెప్టెన్ తీసుకున్న నిర్ణయాన్ని భారత బౌలర్లు అద్భుతంగా నిజం చేశారు.
అద్భుతమైన ఫామ్లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసింది. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమె.. 4 వికెట్లు పడగొట్టి జపాన్ బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసింది.
భారత బౌలర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు క్రీజులో కనీసం నిలదొక్కుకోలేకపోయారు. జపాన్ ఇన్నింగ్స్ మొత్తంలో ఆ జట్టు బ్యాటర్లు కేవలం మూడు బౌండరీలు మాత్రమే కొట్టగలిగారు.
మరోవైపు పార్ట్టైమ్ స్పిన్నర్ షెఫాలి వర్మ కూడా బంతితో సత్తా చాటింది. ఆమె 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంది.
వివరాలు
షెఫాలి వర్మ విధ్వంసకర బ్యాటింగ్
మరో ఇద్దరు బ్యాటర్లు రన్అవుట్గా వెనుదిరిగారు. దీంతో జపాన్ జట్టు కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.
ఓపెనర్ షెఫాలి వర్మ మొదటి నుంచే జపాన్ బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేసింది.
తుఫాన్ ఇన్నింగ్స్తో భారత జట్టు విజయాన్ని మరింత సులభం చేసింది. మరో ఎండ్లో రిచా ఘోష్ కూడా రాణించింది. ఆమె 6 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
దీంతో టీమిండియా కేవలం 30 బంతుల్లోనే 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.