T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్.. పాకిస్థాన్ ఆడేనా, బహిష్కరిస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్కు మద్దతుగా టీ20 వరల్డ్ కప్ 2026ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ ఆదివారం తమ జట్టును ప్రకటించింది. అయితే టోర్నీలో పాల్గొనాలా లేదా అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చెప్పారు. సంబంధిత వర్గాల ప్రకారం, బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ ప్రపంచ కప్లో తమ జట్టును ఆడకూడదని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ టోర్నీలో పాల్గొన్నా, భారత్తో జరిగే మ్యాచ్ (IND vs PAK)ను బహిష్కరించాల్సిందిగా పాకిస్థాన్ యోచిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో షెడ్యూల్ చేయబడిన విషయం తెలిసిందే.
Details
తుది నిర్ణయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంది
పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపిన ప్రకారం తుది నిర్ణయం ప్రధానమంత్రిపై ఆధారపడి ఉంటుంది. కానీ, టీ20 ప్రపంచకప్లో పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతించకపోవచ్చని సంకేతాలున్నాయి. ఇది కేవలం క్రికెట్ సమస్య మాత్రమే కాదు, దేశ గౌరవంతో సంబంధమున్న విషయం. బంగ్లాదేశ్ తన చట్టబద్ధ హక్కులను కోల్పోయింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్ కూడా టోర్నీలో పాల్గొనడంపై పునరాలోచన చేస్తున్నది. అంతర్జాతీయ క్రీడల్లో ద్వంద్వ ప్రమాణాలు అనుమతించకూడదు. ఒకవైపు భారత్కు వేదికలను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చారు, కానీ బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో వేదికను మార్చాలంటే తిరస్కరించారు. ఐసీసీ నిజంగా క్రికెట్ ప్రపంచ క్రీడగా అభివృద్ధి చెందాలంటే ఈ రకమైన ఎంపిక విధానాలకు ముగింపు పలకాలన్నారు.
Details
పీసీబీ ఇప్పుడు మూడు ఆప్షన్లను పరిశీలిస్తోంది
1. టోర్నీలో ఆడితే ప్రతి మ్యాచ్లో నల్ల రంగు బ్యాండ్ ధరించడం. 2. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించడం. 3. టోర్నీలో సాధించే ప్రతి విజయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ మద్దతుదారులకు అంకితం చేయడం.