IND vs WI : విండీస్పై గెలుపు.. సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 01, 2026
10:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత జట్టు సత్తా చాటింది. విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ కు అర్హత సాధించింది. విండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్నిమరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఓపెనర్ సంజు శాంసన్ (97*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. సెమీస్ లో వాంఖడే వేదికగా మార్చి 5న ఇంగ్లండ్ తో టీమిండియా తలపడనుంది.