LOADING...
 IND vs SA : తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా

 IND vs SA : తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
10:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 101 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా మొదటి ఓవర్ నుంచే తడబడింది. భారత బౌలర్లు దాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కేవలం 74 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఆ జట్టులో బ్రెవిస్ (22) ఒక్కరే టాప్ స్కోరర్ గా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు తీయగా, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే తలా ఓ వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

101 పరుగుల తేడాతో ఇండియా గెలుపు

Advertisement