LOADING...
Under-19 Asia Cup: యూత్ వన్డేల్లో టీమిండియా ఘనత.. 433 పరుగులతో నూతన చరిత్ర!
యూత్ వన్డేల్లో టీమిండియా ఘనత.. 433 పరుగులతో నూతన చరిత్ర!

Under-19 Asia Cup: యూత్ వన్డేల్లో టీమిండియా ఘనత.. 433 పరుగులతో నూతన చరిత్ర!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 ఆసియా కప్ 2025 ప్రారంభ మ్యాచ్‌లోనే భారత యువ జట్టు సత్తా చాటింది. యూఏఈతో జరిగిన ఆరంభ పోరులో టీమిండియా కుర్రాళ్లు దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక పంపేశారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన భారత జట్టు యూత్ వన్డే చరిత్రలో తమకెన్నడూ లేని అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగులు సృష్టించి సంచలన రికార్డును సొంతం చేసుకుంది.

Details

14 ఏళ్ల వైభవ్ అద్భుతం

ఈ రికార్డు ఇన్నింగ్స్‌కు కేంద్రబిందువుగా నిలిచింది 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. అతడు ఆకాశమే హద్దుగా ఆడుతూ కేవలం 95 బంతుల్లో 171 పరుగులు బాదాడు. అతని శతక ఇన్నింగ్స్‌ భారత భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది. మిడిల్ ఆర్డర్‌లో ఆరోన్ జార్జ్ (69), విహాన్ మల్హోత్రా (69) కూడా దూకుడైన ఇన్నింగ్స్‌తో పరుగుల వరద పారించారు.

Details

అరుదైన ప్రపంచ రికార్డు టీమిండియాకే

ఈ భారీ స్కోరుతో భారత్ యువజట్టు ఓ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. యూత్ వన్డేల్లో మూడుసార్లు 400కి పైగా స్కోరు చేసిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. 2004లో స్కాట్లాండ్‌పై - 425/3 2022లో ఉగాండాపై - 405/5 ఇప్పుడు యూఏఈపై - 433/6 అయితే, యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు మాత్రం ఆస్ట్రేలియాకే (480/6, కెన్యాపై 2002లో) కొనసాగుతోంది.

Advertisement