LOADING...
Team India: ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ టూర్‌కు టీమిండియా స్క్వాడ్‌.. సిరాజ్‌కు రెస్ట్‌, ప్రసిద్ధ్‌కు ఛాన్స్
ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ టూర్‌కు టీమిండియా స్క్వాడ్‌.. సిరాజ్‌కు రెస్ట్‌, ప్రసిద్ధ్‌కు ఛాన్స్

Team India: ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ టూర్‌కు టీమిండియా స్క్వాడ్‌.. సిరాజ్‌కు రెస్ట్‌, ప్రసిద్ధ్‌కు ఛాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల కోసం టీమిండియా క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది. ముందుగా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. అనంతరం ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ పర్యటనలకు ముందు భారత జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి కల్పించిన బీసీసీఐ.. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. జూన్ 26న ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా, రెండో మ్యాచ్ జూన్ 28న నిర్వహించనున్నారు. ఆ తర్వాత జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

వివరాలు

బీసీసీఐ అధికారిక ప్రకటన

ఈ రెండు పర్యటనలకు ఒకే జట్టును ఎంపిక చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ వైద్య బృందం, టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చించిన అనంతరం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని సూచించినట్లు వెల్లడించింది. దీంతో అతడి స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు జట్టులో అవకాశం కల్పించారు. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల కోసం ఎంపికైన భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

వివరాలు 

భారత జట్టు ఇదే

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివ్ దూబె, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.

Advertisement